విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావు.. పోలీసుల విచారణలో అనేక విషయాలను బయటపెట్టినట్టుగా సమాచారం అందుతుంది. తాజాగా నిందితుడి గురించి మరింత అసక్తికర సమాచారం వెలుగులోకి వస్తుంది. మూడు బ్యాంకు ఖాతాలను నడుపుతున్న శ్రీనివాస్ ఖాతాలో వేల కోద్ది డబ్బులు వచ్చి పడేవని, వాటిని వెంటనే విత్ డ్రా చేసి శ్రీనివాస్ జల్సాలకు ఖర్చుచేసే వాడని తెలుస్తుంది.
ఇక మరీ ముఖ్యంగా వుమెనైజర్ అయిన శ్రీనివాస్ డబ్బులు పడగానే అమ్మాయిలకు ఖర్చు చేసేవాడని సమాచారం. దీంతో పాటు స్నేహితులకు పార్టీలు ఇచ్చేవాడని, సిట్ అధికారులు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. అయితే అతని ఖాతాలో వేల రూపాయలను ఎశరు వేశారు.? ఎందుకు వేశాలరు.? అన్న కోణంలో ఇప్పుడు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విమానాశ్రయం క్యాంటిన్ లో వెయిటర్ గా పనిచేసే శ్రీనివాసరావుకు వేల రూపాయలను ఎవరు వేశారన్న చిక్కుముడులను చేధించే పనిలో వున్నారు సిట్ అధికారులు.
మూడు నెలల క్రితం ఒక్క లావాదేవీతో రూ. 40 వేలు శ్రీనివాస్ ఎస్బీఐ ఖాతాలోకి వచ్చి చేరాయి. వాటిని రెండు రోజుల్లోనే ఖర్చు చేసేశాడు శ్రీనివాస్.. ఆ తరువాత మరోసారి రూ. 30 వేలు వచ్చి చేరగా వాటిని ఒక్క రోజులో ఖర్చుచేశాడు. ఈ డబ్బును అమ్మాయిలతో పార్టీలకు, వారికి గిఫ్ట్ లు కొనిచ్చేందుకు, స్నేహితులకు మందు పార్టీ ఇచ్చేందుకు ఖర్చు చేశాడు, కాగా, శ్రీనివాస్ ఖాతాకు అతను పనిచేసే క్యాంటీన్ యజమాని హర్ష రూ. 40 వేలు బట్వాడా చేసినట్టు గుర్తించిన సిట్, ఈ విషయంలో హర్షను కూడా విచారించింది. కాగా, ప్రస్తుతం శ్రీనివాస్ ఖాతాలో రూ.1365 మాత్రమే ఉన్నాయని గుర్తించారు అధికారులు.
శ్రీనివాస రావు ఫ్లాట్ లో ఇద్దరు అమ్మాయిలు
శ్రీనివాస రావు కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.. మరో ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఎయిర్ పోర్టుకు కేవలం కిలోమీటరు దూరంలోనే ఉన్న ఓ ఫ్లాట్ లో శ్రీనివాసరావు, అతని స్నేహితుడు రాజు, మరో యువకుడు, ఇద్దరు యువతులు ఉండేవారని తెలుస్తోంది. వీరందరూ ఎయిర్ పోర్టులోని ఫ్యూజన్ రెస్టారెంట్ లోనే పని చేస్తున్నారని కూడా సమాచారం. ఇక, జగన్ పై దాడికి కొన్ని రోజుల ముందు ఈ ఇద్దరు అమ్మాయిలూ ఫ్లాట్ నుంచి వెళ్లిపోయారు.
కాగా, గ్వాలియర్ నుంచి నరేష్ కుష్వా, భరత్ సింగ్ అనే ఇద్దరు కుక్ లు వచ్చారు. వీరిద్దరూ గతంలో అదే రెస్టారెంట్ లో పని చేసి గ్వాలియర్ కు వెళ్లిపోగా, వారిని అధిక వేతనంపై ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ యాజమాన్యం తిరిగి వెనక్కు పిలిపించినట్టు తెలుస్తోంది. వీరు వచ్చేసరికి కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఎవరు? వారు ఎక్కడికి వెళ్లారన్న విషయాలపై మరింత స్పష్టత రావాల్సివుంది. వీరిద్దరి దుస్తులూ ఇంకా శ్రీనివాసరావు ఉన్న ఫ్లాట్ లోనే ఉండటం గమనార్హం. ఫ్లాట్ కు వెళ్లి ఇద్దరు కుక్ లను సిట్ అధికారులు విచారించగా, శ్రీనివాస్ గురించి తమకేమీ తెలియదని, ఐదు రోజుల క్రితమే వచ్చామని వారు వెల్లడించారని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more