దసరా, దీపావళి పండుగ పేరు చెప్పగానే ముందుగా సామాన్య మధ్యతరగతి ప్రజలకు గుర్తుకువచ్చేంది డిస్కౌంట్ ఆపర్లు. ఈ పండగ సీజన్ ను సద్వినియోగం చేసుకునేందుకు దిగ్గజం ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లు పండుగ ఆఫర్లను ప్రకటించి పెద్ద మొత్తంలో వ్యాపారం చేసుకుంటాయి. దసరా సీజన్ లో ఐదు రోజుల పాటు దీపావలి పండుగను పురస్కరించుకుని మరో ఐదు రోజుల పాటు ఈ ప్రత్యేక అఫర్లను ప్రకటించాయి. అయితే తాజాగా ఈ కామర్స్ సంస్థలకు తోడు ఇప్పుడు విమానయాన సంస్థలు కూడా రంగంలోకి దిగాయి.
ఈ పండుగ పర్వదినాలలో తమ టికెట్లు బుక్ చేసుకునే కస్టమర్లకు ఆఫర్లను ప్రకటించాయి. చవక ధరల్లో టికెట్లను ఆఫర్ చేస్తూ ప్రయాణికులను పెంచుకునే మార్గాన పడ్డాయి. చౌకధర విమానయాన సంస్థలుగా పేరొందిన ఇండిగో, స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ సంస్థలు కస్టమర్ల కోసం దీపావళి ధమాక సేల్ అపర్లను ప్రకటించాయి. ఇండిగో విమానయాన సంస్త రూ.899తో దేశీయ ప్రయాణాలకు టికెట్లను ఆఫర్ చేయగా, తాజాగా మరో సంస్థ స్పైస్ జెట్ రంగంలోకి దిగింది.
దేశంలోని ఎక్కడికైనా అతి తక్కువ ధరతో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. అందులో భాగంగా ఇండిగో కంటే తక్కువకే రూ.888కే టికెట్లను ఆపర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది నవంబరు 8 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 మధ్య ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ నెల 28 వరకు ఆఫర్ల టికెట్లను విక్రయించనున్నట్టు స్పైస్ జెట్ తెలిపింది. ఇటీవల ఇండిగో రూ.899తో 10 లక్షల సీట్లను అందుబాటులో ఉంచినట్టు ప్రకటించింది.
ఇక ఎయిర్ ఏషియా ఇండియా కూడా దీపావళి పండగ సేల్ ఆఫర్ ను ప్రకటించింది. దేశంలోని ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్లాలన్న పండుగ సీజన్ డిస్కౌంట్ ఆఫర్ కింద ఏకంగా 70 శాతం రాయితీని ప్రకటిస్తుంది. వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఈ టిక్కెట్లపై రాయితీతో ప్రయాణించే అవకాశం వుంది. అయితే ఈ టికెట్లు ఈ నెల 28తో ముగియనున్నాయి. ఈ చౌకధర విమానయాన సంస్థ ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు ఏకంగా 754.11 లక్షల మంది ప్రయాణికులను దేశీయంగా తమ గమ్యస్థానాలను చేర్చిందని ఓ ఏవియేషన్ సంస్థ నివేదిక తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more