స్వతంత్ర ప్రతిపత్తి గల సీబిఐ సంస్థ డైరెక్టర్ అలోక్ వర్మను బలవంతంగా సెలవులపై పంపించడం.. రాజేష్ ఆస్తానను కేంద్రం వెనకేసుకుని రావడంతో ఈ సంస్థలో కమ్ములాటలకు దారి తీసని పరిణామాల తీరును తీవ్రంగా ఎండగట్టిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్త అందోళనను చేపట్టింది. సీబిఐ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ర్యాలీకి పిలుపునిచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న సిబిఐ కార్యాలయాల వద్ద విపక్షాలు పెద్దయెత్తున నిరసనలు చేపట్టాయి.
సీబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని దయాళ్ సింగ్ కాలేజ్ వద్ద నుండి సిబిఐ ప్రధాన కార్యాలయం వరకు చేపట్టిన మార్చ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆయనతో పాటు నిరసన కార్యక్రమంలో పాల్గోన్న కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే.. జనతాదళ్ నెత శరద్ యాదవ్ సహా పలువురు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ఓ వ్యానులో ఎక్కించిన పోలీసులు స్థానిక లోధీ కాలనీ పోలిస్ స్టేషన్ కు తరలించారు.
#WATCH: Congress workers stage protest against the removal of CBI Chief Alok Verma in #Delhi. pic.twitter.com/BRk8Vvwvgv
— ANI (@ANI) October 26, 2018
కాగా, అంతకముందు రాహుల్ మాట్లాడుతూ దేశప్రజల పాలిట తాను కాపలాదారుగా వుంటానన్న నరేంద్రమోడీ.. దేశ ప్రజల పాలిట దోపిడీదారుగా మారి.. అర్థిక నేరగాళ్లను దేశం నుంచి పంపుతూనే మరోవైపు సంపన్నుల జేబులు నింపుతున్నారని దుయ్యబట్టారు. దేశంలోని సిబిఐ, ఈడీ, ఐటీ ఎన్నికల కమిషన్ సహా ప్రతి సంస్థను ప్రధాని నరేంద్ర మోడీ నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వీటన్నీటి వెనుక ఒక పెద్ద కారణం చౌకీదారు దొంగగా మారటమేనని విమర్శల దాడి చేశారు.
దొంగగా మారి 30 వేల కోట్ల రూపాయలను అనిల్ అంబానీ జేబులో పెట్టారని అన్నారు. రాఫెల్ డీల్ లో జరిగిన కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నందునే సీబిఐ చీఫ్ అలోక్ వర్మను అర్థరాత్రి ఒంటిగంటకు అఘమేఘాల మీద నిర్ణయం తీసుకుని సెలవుపై వెళ్లాలని బలవంతపెట్టారని రాహుల్ అన్నారు. మోడీ నిజాన్ని కొంతకాలం దాచగలరని, కొంత కాలం బయటకు రానీయకపోవచ్చునని, అయితే నిజం మాత్రం ఎన్నటికైనా బయటకు వస్తుందని అప్పుడు ఈ డ్రామాలు తేటతెల్లం అవుతాయని అన్నారు.
దేశవ్యాప్తంగా జరిగిన సీబిఐ వ్యవహారంపై నిరసన కార్యక్రమంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాష్ట్రస్థాయి నేతలు సీబిఐ కార్యాలయాల ఎదుట అందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తర్ ప్రదేశ్ లో రాజ్ బబ్బర్ నేతృత్వంలోని కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రజాభిత కార్యక్రమాలు చేయాల్సింది పోయి.. సంపన్నుల జేబులు నింపే కార్యక్రమాలకు తెర లేపుతున్నారని రాజ్ బబ్బర్ తీవ్రంగా విమర్శించారు. దీంతో యూపీ పోలీసులు అతనితో పాటు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more