ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిపై ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సీరియస్ అయ్యారు. ఈ సంఘటనపై వివరాలు ఆరా తీసేందుకు ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపి ఆర్పీ ఠాకూర్ కు ఫోన్ చేశారు. విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వివరాలను గవర్నర్ నరసింహన్ డీజీపీని అడిగి తెలుసుకున్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగారు. ఈ సంఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆయన డీజీపీని ఆదేశించారు.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన దాడిని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఖండించారు. విమానాశ్రయం లాంజ్ లో కూర్చున్న జగన్ పై దుండగుడు కత్తితో దాడి చేయడాన్ని ఆయన పిరికిపంది చర్యని అన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఆధునిక సమాజంలో ఇటువంటి పిరికిపంద చర్యలకు స్థానం లేదని అన్నారు. మరో మంత్రి జవహార్ కూడా ఈ దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదని అన్నారు. కేంద్ర బలగాల అధీనంలో వుండే ఎయిర్ పోర్ట్ లోపలికి ఓ వ్యక్తి కత్తిని ఎలా తీసుకెళ్లగలిగారని ప్రశ్నించారు.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జగన్ పై జరిగిన దాడిపై స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ దాడిని అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఖండించాలని చెప్పారు. ఎంతో సురక్షితమైన ఎయిర్ పోర్ట్ లో దాడి జరగడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని చెప్పారు. దాడికి యత్నించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జిరిగిన దాడిని పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఇది అమానుష చర్యగా ఆయన పేర్కోన్నారు. ప్రతిపక్ష నేతలపై ఇలాంటి దాడులు జరగడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామంలో ఇలాంటి దాడులకు తావులేదని జనసేనాని అన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఇలాంటి దాడులను ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more