దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ అంశాన్ని కూడా ఎన్నికలలో ప్రచారాస్త్రాంగా మార్చుకున్న భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఆ పేరుతో కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా ఈ నెల రాష్ట్రానికి వచ్చిన బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. తమ పార్టీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ అంతిమ సంస్కారాల్లో బాగంగా ఐదు కిలోమీటర్ల మేర నడిచామని, అది తమకు ఆయన పట్లవున్న గౌరవానికి నిదర్శమని చెప్పుకోచ్చారు.
అయితే ఇదే విషయాన్ని మాత్రం ఛత్తీస్ గఢ్ లో ప్రస్తావించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానిగా కొనసాగుతున్న హాయంలో తన పిలుపుతో కొందరు ఎంపీలను తన పార్టీ వైపుకు అకర్షించే అవకాశం వున్నా.. తాను కట్టుబడిన, నమ్మిన సిద్దాంతాలకు వ్యతిరేకంగా వెళ్లడం ఇష్టంలేక.. కేవలం ఒక్క ఓటుతో అధికారాన్ని చేజార్చుకున్నారు ఆయన. అయితే తన ఓటమినే అస్త్రంగా మార్చుకున్న.. దానినే ప్రచారం చేసిన ఆయన మరోమారు ప్రజల్లోకి వెళ్లడంతో దేశప్రజలకు ఆయనకు అధికారాన్ని అందించారు.
అలా ఆయన నమ్మిన, ఆచరించిన సిద్దాంతాల బాటలోనే పయనించింది ఆయన మేనకొడలు కరుణా శుక్లా. జాంగీర్ నియోజకవర్గం నుంచి బీజేపి పార్లమెంటు సభ్యురాలిగా ప్రతినిధ్యం వహించిన ఆమె.. 2009లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థఇ డాక్లర్ చరణ్ దాస్ మహంత్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక అప్పటికే వాజ్ పాయ్ కూడా పార్టీ వ్యవహారాలకు దూరంగా వున్న క్రమంలో అమెను కూడా బీజేపి అధిష్టానం దూరం పెట్టింది. దీంతో బీజేపి అధిష్టానంపై కలత చెందిన ఆమె.. తన మేనమామ ఉన్నప్పటి సిద్దాంతాలు పార్టీలో లేవని అమె ఏకంగా కాంగ్రెస్ లో చేరారు.
అంతేకాదు.. మరో నెల రోజుల వ్యవధిలో జరగనున్న చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో అమె కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. ఏకంగా చత్తీస్ గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పైనే ఆమె పోటీ చేయనున్నారని వార్తలు వినబడుతున్నాయి. రమణ్ సింగ్ ప్రాతినిథ్య వహిస్తున్న రాజ్ నంద్ గావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అమె బరిలో నిలిపేందుకు రమారమి అంతా ఖారారైపోయింది. అయితే కాంగ్రెస్ సెంట్రల్ కమిటీ అమోదముద్ర వేయడమే తరువాయని సమాచారం. వాజ్ పాయ్ పైనున్న గౌరవంతోనే కరుణాశుక్లాను పక్కనబెట్టారా..?అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more