వివాదాస్పద రాఫెల్ డీల్ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం వెనుక అక్రమాలు జరిగాయని ఈ విషయంలో నిజానిజాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. వాటిని విచారణకు స్వీకరించింది. కాగా, ఈ కేంద్రానికి నోటీసులను ఇచ్చేందుకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది.
రాఫెల్ ఒప్పందం వివరాలు వెల్లడించాలంటూ దాఖలైన పిటిషన్లను కోట్టివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కూడా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడానికి అయిష్టతను వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపించింది. రాఫెల్ రాఫెల్ ఒప్పందం వివరాలను సీల్డ్ కవర్ లో ఈ నెల 29లోగా కోర్టుకు సమర్పించాలని అదేశించింది.
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం ఫ్రాన్స్కు చేరేవరకు జరిగిన నిర్ణయాల ప్రక్రియ.. ఆఫ్సెట్ భాగస్వామిగా భారత కంపెనీ ప్రమేయం వంటి వివరాలను సీల్డ్కవర్ ద్వారా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. యుద్ధ విమానాల ధరలు, ఒప్పందంలోని సాంకేతిక వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని ధర్మాసరం పేర్కొంది. అవినీతి జరిగిందని చేస్తున్న ఆరోపణలను తాము పరిగణలోకి తీసుకోవడం లేదని కూడా కోర్టు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను 31వ తేదీకి వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more