అసోం అసెంబ్లీ స్పీకర్ కృపానాథ్ మల్లాహ్ కు తన సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. కరీంగంజ్ జిల్లాలోని రాతాబరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన డిఫ్యూటీ స్పీకర్ గా తొలిసారిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ఉపసభాపతి పదవి లభించిన తరువాత ఢిప్యూటీ స్పీకర్ హోదాలో ఆయన తొలిసారిగా తన నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు వెళ్లారు. అయితే అక్కడే ఆయనకు అనుకోకుండా పరాభవం ఎదురైంది.
ఆయన ప్రమాదవశాత్తు అంబారీ నుంచి కింద పడిపోయారు. అక్టోబర్ 5న కృపానాథ్ అస్సోం అసెంబ్లీ ఉప సభాపతిగా ఎన్నికైన సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలకాలని ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఏకంగా ఏనుగు అంబారీని సిద్ధం చేశారు. కృపానాథ్ కరీంగంజ్ జిల్లాలోకి రాగానే ఆయన్ని అంబారీ ఎక్కించారు. అంబారీపైకి ఎక్కిన కృపానాథ్ కు ముందు మావటి కూడా కూర్చున్నాడు. అయితే ముందుకు కదిలే సమయంలో ఢిప్యూటీ స్పీకర్ కిందపడిపోయారు.
వెంటనే అభిమానులు ఆయన లేపేందుకు పరుగులు తీశారు. ఆయనను లేపి.. కారు వద్దకు తీసుకెళ్లారు. అయితే ఏనుగు ఒక్కసారి ముందుకు వెళ్లే క్రమంలో కృఫానాథ్ పట్టుతప్పి.. మావటిని పట్టుకున్నాడు. అయితే మావటి కూడా ఢిఫ్యూటీ స్పీకర్ తో పాటు కింద జారిపడ్డారు. అయితే బరువు మోయలేక ఏనుగు ఒక్కసారిగా ముందుకు పరిగెత్తడంతో ఇలా జరిగిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మావటి వెంటనే ఏనుగు బెదిరిపోకుండా దారి వద్దకు వెళ్లి నిల్చోవడంతో అంతా సవ్యంగా సాగింది. కాగా ఆ సమయంలో మీడియా వర్గాలు తీసిన వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
#WATCH: Newly-elected deputy speaker of Assam assembly Kripanath Mallah falls off an elephant. He was being welcomed by his supporters in
— ANI (@ANI) October 8, 2018
Ratabari, his own constituency, in Karimganj district. The deputy speaker was unhurt in the incident. (06.10.2018) #Assam pic.twitter.com/2UYHkS7zvx
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more