తమిళనాడు రాజధాని చెన్నైలో ఘోర ప్రమాదం సంభవించింది. ఇక్కడి పిళ్లయార్ రోడ్డులో రెండు మినీ ట్రక్కులు బాణాసంచాను దించుతుండగా.. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బాణసంచాను లారీలోకి ఎక్కిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థంలోనే చనిపోయారు. వీరితో పాటు బాణాసంచాను దీపావళి పండగ నేపథ్యంలో విక్రయించేందుకని తెప్పించిన యజమాని కూడా అసుపత్రిలో చికిత్స పోందుతూ మరణించాడు.
బాణాసంచా విస్పోటనం దాటికి చుట్టుపక్కల ఉన్న తొమ్మిది ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, ఓ అపార్ట్ మెంట్ భవనం దెబ్బతింది. సమీపంలోని పలు వాహనాలు కూడా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని ఈరోడ్ ప్రాంతంలోగల శాస్త్రీనగర్ లో బుధవారం ఈ ఘటన సంభవించింది.
దీపావళి పండగను పురస్కరించుకుని ఆఫ్ సీజన్ లోనే బాణాసంచా అర్ఢర్ ను తెచ్చుకుంటే రాయితీతో తక్కువ ధరకే లభిస్తుందని స్థానికంగా నివసించే కార్తీక్ అనే వ్యక్తి వీటి కోసం అర్డర్ చేశారు. తమిళనాడులోని శివకాశీ ప్రాంతంలోని బాణాసంచా తయారీ కర్మాగారాల నుంచి తెప్పించాడు. అయితే నిన్న రాత్రే పార్శిల్ వచ్చింది, దీంతో ఇవాళ తెల్లవారు జామున వాటిని తన నివాసానికి రెండు మినీ ట్రక్కులలో లోడ్ చేసుకుని తెప్పించుకున్నాడు కార్తీక్.
రెండు ట్రక్కుల నిండా వున్న బాణాసంచాను వాటి నుంచి దింపి స్థానికంగా వున్న తన గోడౌన్ లో వాటిని పెడుతున్న క్రమంలో ఒక ట్రక్కులోని బాణాసంచా నుంచి మంటల చెలరేగాయి. క్షణాల్లో అవి వ్యాపించి బాణాసంచాను అన్ లోడ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను బలితీసుకున్నాయి. ఆర్డర్ చేసిన కార్తీక్ కూడా అగ్నికి అహుతి కాగా, స్థానికులు అయనను అసుపత్రికి తరలిచగా, అక్కడ చికిత్స పోందుతూ చనిపోయాడు.
ఈ ఘటనలో స్థానికంగా వున్న తొమ్మిది ఇళ్లు, ఒక అపార్టుమెంటు కూడా ధ్వంసమయ్యింది. పలు వాహనాలు కూడా బాణాసంచా ధాటికి కొన్ని అహుతవ్వగా, మరికొన్ని దహనమయ్యాయి. నివాస సముదాయాల మధ్య బాణసంచా తయారీ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నామనీ, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more