పెరుగుతున్న పెట్రోలు ధరలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలో కేంద్రంలోని అధికార పక్షం మాత్రం తాము గత ప్రభుత్వాల కన్నా ఎంతో మేలని చాటుకునే ప్రయత్నం వారిని అబాసుపాలు చేసింది. ధరల పెంపు విషయంలో తమ ప్రభుత్వం గత యూపీఏ హయాం కంటే ఎంతో మేలని చాటుకునే ప్రయత్నం చేసింది. అక్షరాల పెద్దలు చెప్పినట్లు మసిపూసి మారేడు కాయ అని నమ్మించే అధికార పక్షం ప్రయత్నం బెడిసికొట్టింది.
అంతకంతకూ పెరుగుతూ ఆకాశాన్నంటే విధంగా దూసుకెళ్తున్న ఇంధన ధరలపై విపక్షాలు భారత్ బంద్ కూడా పాటించాయి. అయితే ఇదోదే తమ ప్రభుత్వంతోనే జరిగిందా.? గతంలోనే పెట్రోల్ ధరలు అమాంతం పెరిగాయని కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చేందుకు కేంద్రంలోని అధికార ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అంతటితో అగకుండా నిజంగా ఎవరికైనా పూర్తి గణితశాస్త్రంపై అవగాహన, పట్టు వుంటే.. తమ ప్రధాని మోదీ హాయంలోనే ధరలు తగ్గాయని కొత్త వాదనకు తెరతీసింది.
అదెలా అంటే భారత్ బంద్ ను చేపట్టిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను దోషిగా చేసే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నం పూర్తిగా బెడిసి కోట్టి.. బొక్కబోర్లా పడింది. బీజేపి చేసిన ప్రయత్నాలను నెటిజనులు బహుబాగా తిప్పికోట్టడంతో వ్యూహాత్మక మౌనాన్ని వహించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ‘పెట్రోలియం ధరల పెరుగుదలపై వాస్తవం ఇదీ' అంటూ ట్వీట్టర్ లో ఓ ఫొటో పోస్టు చేసిన బీజేపి అభాసుపాలైంది. భారీగా పెరిగిన పెట్రోలు ధర సూచీని తగ్గించి.. తక్కువ ఉన్న ధరల సూచీని ఎక్కువ చేసి చూపించింది.
పెట్రో ధరల పెంపునకు నిరసనగా విపక్షాలు చేపట్టిన బంద్ను నిరసిస్తూ బీజేపీ తన ట్విట్టర్ ఖాతాలో రెండు గ్రాఫ్లు పోస్టు చేసింది. వాటిలో ఢిల్లీలో మే 2014లో లీటరు పెట్రోలు ధరను రూ. 71.41గా చూపించింది. కానీ ఇప్పుడు మాత్రం రూ.80.73గా ఉన్నట్టు చూపించింది. అక్కడి వరకు బాగానే ఉంది కానీ, రూ.80తో పోలిస్తే రూ.70 చాలా ఎక్కువని అర్థం వచ్చేలా రూ. 71.41 సూచీని బాగా పెంచేసి, రూ.80.73 సంకేతాన్ని బాగా తగ్గించి చూపించింది. రూ.80.73 కంటే 71 రూపాయలే ఎక్కువ అని చెబుతూ బీజేపీ చేసిన పోస్టును చూసిన నెటిజన్లు పడీపడీ నవ్వుకుంటున్నారు. అంకెలు రానివాళ్లు దేశాన్ని పాలిస్తున్నారంటూ ఎగతాళి చేస్తున్నారు. కాంగ్రెస్ను ఇరుకున పెట్టాలని ప్రయత్నించి బీజేపీనే ఇరుకున పడిందని సెటైర్లు వేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more