ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా.? అన్నది మనకు పెద్దలు చెప్పిన సామెత. ఇప్పడీ సామెత ఎందుకంటారా.? మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయీ అంత్యక్రియలకు హాజరైన బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. కాలుపై కాలు వేసుకుని దర్జాగా కూర్చోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీకి చెందిన మహావృక్షం నేలకూలితే ఇదేనా ఆయనకు మీరిచ్చే గౌరవం అంటూ నెట్టింట్లో జనులు వాతలు పెట్టారు. ఓ వైపున ప్రధాని నరేంద్రమోడీ.. మరోవైపున బీజేపి కురువృద్ద నేత ఎల్కే అద్వానీ కూర్చోని వుండగా ఇలా కాలుపై కాలు వేసుకోవడం ఎంత అమర్యాద అని ప్రశ్నించారు.
ఇదిలావుంచితే.. తాజాగా అదే అటల్ జీ సంస్మరణ సభలో కూడా ఇద్దరు బీజేపి మంత్రులు ఆయనను అవమానపర్చేలా వ్యవహరించారు. ఓ వైపు ప్రజలు, పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చిన సభలో వేదికపై అసీనులైన మంత్రులు నవ్వుతూ కనిపించడం గమనార్హం. సభలో వీరిద్దరూ నవ్వుతూ, ఒకరికొకరు ముచ్చట్లు చెప్పుకుంటున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. దీనిపై నెట్ జనులు విమర్శలు గుప్పించగా, ఒక్కోక్కరు ఒక్కోలా స్పందించి కామెంట్లు పెట్టారు.
వివరాల్లోకి వెళితో ఛత్తీస్గఢ్కు చెందిన వ్యవసాయశాఖ మంత్రి బ్రిజ్ మోహన్ అగర్వాల్, ఆరోగ్యశాఖ మంత్రి అజయ్ చంద్రకర్ లు వాజ్ పేయీ అస్థికలను అన్నినదుల్లో కలిపే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు హాజరయ్యారు. ఈ వీడియోలో చంద్రకర్ నవ్వుతూ తన ఎదురుగా ఉన్న బల్లపై చరిచారు. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు ధరమ్ లాల్ కౌశిక్ అలా చేయవద్దని వారిస్తున్నట్లుగా ఆ వీడియోలో నమోదైంది. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వేదికపై ఉండగానే ఇలా జరగడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ వీక్షించండీ..
దీంతో పార్టీ జాతీయ అధ్యక్షుడి అగౌరవపర్చేలా కాలుపై కాలు వేసుకున్న నేపథ్యంలో మంత్రులు ఏకంగా నవ్వుతూ కనిపంచడంతో అవు.. దూడ సామెత గుర్తుకువచ్చింది. ఈ విషయంపై ఈ రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శైలేశ్ నితిన్ త్రివేదీ మాట్లాడుతూ.. వాజ్ పేయీ జీవించి ఉన్నప్పుడు కూడా ఆయనను విస్మరించారని విమర్శించారు. ప్రస్తుతం వారి ప్రవర్తన చూస్తుంటే అంతటి ముఖ్య నాయకుడికి వారిచ్చే మర్యాద ఏపాటిదో తెలుస్తోందన్నారు. ఇలాంటి చర్యలు ఆక్షేపణీయమని పేర్కొన్నారు. వాజ్ పేయీని గౌరవించకపోయినా ఫర్వాలేదు కానీ.. ఇలాంటి చేష్టలతో అగౌరవపరచొద్దని కోరారు. మాజీ ప్రధానిపై ప్రేమ, గౌరవం ఉన్నట్లు సీఎం రమణ్సింగ్తో పాటు బీజేపి నాటకాలాడుతోందని దుయ్యబట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more