యోగా గురు బాబా రాందేవ్ పతాంజలి సంస్థ ఆయుర్వేద ఉత్పత్తుల నుంచి ఎఫ్ఎంజీసీ రంగంలకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఏకంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో పాటుగా మెసేజింగ్ యాప్ వాట్సాప్కు పోటీగా ‘కింభో’ యాప్ను విడుదల చేసి, ఆ తర్వాత వెనక్కి తీసుకుని అభాసుపాలైంది. అందులోని లోపాలను సరిచేసి మరిన్ని ఫీచర్లు జోడించి ఈ నెలలో మరోమారు విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే దానిని గూగుల్ ప్లే స్టోర్లో పెట్టింది.
పతంజలి కింభో యాప్ను అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదితి కమల్ డిజైన్ చేశారు. గతంలో ఆమె గూగుల్, యాహూ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలలో పనిచేశారు. కింభో యాప్ రీలాంచ్కు సిద్ధమవుతున్న వేళ పతంజలికి అదితి షాకిచ్చారు. ఈ ప్రాజెక్టుకు గుడ్ బై చెప్పేసి బయటకొచ్చారు. గతంలో ఆమె తీసుకొచ్చిన ‘బోలో మెసేంజర్’ యాప్ను పునరుద్ధరించి తిరిగి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల 21న అదితి ఈ యాప్ను అందుబాటులోకి తీసుకు రానున్నారు.
కింభో ప్రాజెక్టు నుంచి అదితి తప్పుకోవడంపై పతంజలి ఆయుర్వేద సీఈవో ఆచార్య బాలకృష్ణ స్పందించారు. అదితి తమ అంచనాలను అందుకోలేకపోయారని, అభిప్రాయ భేదాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అదితి మాట్లాడుతూ తాను జూలైలోనే పతంజలి నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. కొన్ని విషయాల్లో భేదాభ్రిపాయాలు ఉన్నట్టు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more