మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మృతి పట్ల పలు ప్రపంచ దేశాలు స్పందించాయి. మరీ ముఖ్యంగా ఆయన చేసిన సేవలను.. ఆయన భారత విదేశాంగ శాఖ మంత్రిగా కొనసాగిన తరుణంలో నుంచి ప్రధానమంత్రి వరకు కొనసాగిన హయాంలో తీసుకున్న చర్యలు.. ద్వైపాక్షిక సంబంధాలు బలపడేందుకు ఆయన ఎంచుకున్న వ్యూహాలు, ప్రతివ్యూహాలను కూడా కొనియాడాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా మహానేత వాజ్ పేయికి ఘన నివాళులు అర్పించింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో స్పందిస్తూ.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడేందుకు వాజ్ పాయ్ తీసుకున్న నిర్ణయాలే కారణమని కొనియాడారు.
అప్పటి వరకు అగ్రరాజ్యంతో అంతంతమాత్రంగానే వున్న బంధాలు వాజ్ పేయి హయాం నుండి ధృడంగా తయారయ్యాయని చెప్పారు. రాజకీయా మహార్షి అస్తమించారన్న వార్తతో తాము దిగ్ర్భాంతికి గురయ్యామని, భారత దేశంలో ఓ మహానేతను కోల్పోయిందని తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బ్రిటన్ హై కమీషనర్ కూడా వాజ్ పేయి మృతికి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. డొమినిక్ అస్క్యూత్ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ భారత్ దేశం ఓ గోప్ప నేతను కొల్పోయిందని అన్నారు. ఆయనకు తమ దేశంలో ఒక రాజకీయ జ్ఞానిగా గౌరవం లభించిందని గుర్తు చేసుకున్నారు.
We are saddened by the passing of former PM of India #AtalBihariVajpayee. We will remember him as one of India’s greatest leaders. Shri Vajpayee was much respected in the UK as a statesman par excellence: British High Commissioner to India, Dominic Asquith (file pic) pic.twitter.com/WPGAMh5PH3
— ANI (@ANI) August 16, 2018
అటు దాయాధి దేశం పాకిస్థాన్ కూడా మాజీ ప్రధాని అటల్ జీకి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. అసుపత్రిలో గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన పరమపదించారన్న వార్త తమను విషాదంలో ముంచిందని తెలిపింది. అటల్ జీ ఓ గోప్ప రాజకీయ యోధుడని, పోరుగురాష్ట్రాలతో మరీ ముఖ్యంగా పాకిస్తాన్ తో సంబంధాలను మెరుగుపర్చేందుకు ఆయన చేసిన కృషి శ్లాఘంచింది. సార్క్ దేశాల సదస్సులో కీలక మద్దతును కూడగట్టడంతో పాటు ప్రాంతీయ అభివృద్దికి సహకారాన్ని అందించడంలో వాజ్ పేయి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది.
We have learnt with sadness the passing away of #AtalBihariVajpayee former Prime Minister of India, who was undergoing treatment in a hospital in New Delhi: Pakistan government
— ANI (@ANI) August 16, 2018
పాకిస్తాన్ కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా భారత్ మాజీ ప్రధాని మహానేత అటల్ బిహారీ వాజ్ పేయి మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాల బలోపేతానికి వాజ్పేయి చేసిన కృషి, పడిన తపన ఎప్పటికీ గుర్తుంటాయన్నారు. వాజ్పేయి ఉప ఖండంలోనే గొప్ప నేత అని ఇమ్రాన్ కొనియాడారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినా కూడా వాజ్ పేయి మృతికి సంతాపాన్ని ప్రకటించారు. భారత దేశం ఓ గొప్ప బిడ్డను కొల్పోయిందని పేర్కోన్నారు. సుపరిపాలన, సామాన్యుల సంక్షేమం, ప్రాంతీయ దేశాల మధ్య శాంతి సామరస్యం, ప్రగతి విరబూయడానికి ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమైనది అన్నారు.
Deeply shocked at sad demise of former PM of India #AtalBihariVajpayee, one of the most famous sons of India. He'll be remembered for contributing towards good governance & highlighting issues affecting common people of India as well as regional peace& prosperity: Bangladesh PM pic.twitter.com/XqjcdLWBcx
— ANI (@ANI) August 16, 2018
#AtalBihariVaajpayee was a tall political personality of the subcontinent.His attempts for the betterment of India-Pak relationship will always be remembered. Mr Vajpayee,as a foreign minister,took responsibility of improving India-Pak ties: Pak PM designate Imran Khan (file pic) pic.twitter.com/NQCWOzLOsw
— ANI (@ANI) August 16, 2018
(And get your daily news straight to your inbox)
Aug 08 | తెలంగాణ సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు... Read more
Aug 08 | గవర్నమెంటు జాబ్ కోసం దేశవ్యాప్తంగా ఎందరెందరో విద్యార్థులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వమైనా.. లేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైనా తమకు లభిస్తే.. తమకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందని.. దీంతో ఇక తమ జీవితం... Read more
Aug 08 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కేంద్ర సంస్థలను తమ చెక్కుచేతల్లో పెట్టుకుని.. ప్రతిపక్షాలపై వేధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అరోపించింది. మునుపెన్నడూ లేని విధంగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని అందుకు ఎన్ఫోర్స్మెంట్... Read more
Aug 08 | పుట్టిన రోజు వేడుకల పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. అందులోనూ ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో స్వయంగా రాజకీయ నాయకులే చట్టాలను అతిక్రమించి మరీ బర్త్ డే పార్టీలలో తుపాకీలతో... Read more
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more