మధ్యప్రదేశ్ లో మరో పేద మహిళపై దారుణం జరిగింది. కదులుతున్న రైల్లో ప్రయాణిస్తున్న 30 ఏళ్ల మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ ఈ నెల 6వ తేది రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకోగా. ఇవాళ నిందితుడ్ని పట్టుకుని అరెస్టు చేసి.. న్యాయస్థానంలో హాజరుపర్చారు. గత ఏడాది నవంబర్ 26న అమర్ కంఠర్ ఎక్స్ ప్రెస్ రైలులో చోటుచేసుకున్న ఘటనను ఇంకా రైలులో ప్రయాణించే ఒంటిరి మహిళలు మర్చిపోకముందే ఇదే తరహాలో మరో ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జబల్ పూర్ లోని మదన్ మహల్ రైల్వే స్టేషన్ లో మంగళవారం రాత్రి బాధితురాలు తన గమ్యస్థానానికి చేరుకునేందుకు వింధ్యాచల్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కింది. సదరు మహిళ పాత దుస్తులు, పీలికలు ఎరుకుని వాటిని విక్రయించి జీవనం సాగిస్తుంది. కాగా రైలు ఎక్కిన కాసేపటికే అలసిపోయిన ఆమె నిద్రలోకి జారుకుంది. ఆ సమయంలో ఆ కంపార్టుమెంటులో ఎవరు లేకపోవడాన్ని అదునుగా చేసుకున్న నిందితుడు అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడు అంతకంటే ముందు స్టేషన్ లోనే దిగాల్సి ఉండగా.. దురాలోచనతో అనువైన సమయం కోసం వేచిచూసి కిరాతకానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.
టాయిలెట్ కు సమీపంలో ఉన్న ఓ బెర్తుపై నిద్రిస్తున్న మహిళను అత్యాచారం చేస్తుండగా గుర్తించిన జీఆర్పీ జవాన్.. వెంటనే అతడి బారి నుంచి ఆమెను రక్షించాడు. అనంతరం ఆమెను రైల్వే పోలీసులకు అప్పగించాడు. అతణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడిని ఉమేశ్ వాల్మీకి (26)గా గుర్తించారు. నర్సింగ్ పూర్లో గోటేగావ్ మున్సిపాలిటీ శాఖలో అతడు కూలీగా పని చేస్తున్నాడని పోలీసులు చెప్పారు. అక్కడ నుంచి రైలు అయిదారు కిలోమీటర్ల దూరం ప్రయాణించగానే ఒంటరిగా నిద్రిస్తున్న మహిళపై ఉమేశ్ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more