రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజాసమస్యలపై స్థానికంగా అధ్యయనం కోసం, ఆ సమస్యల పరిష్కారం విషయంలో రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా ‘రెడ్ రెవల్యూషన్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో జనసేన స్థానిక నేతలు ఈ ప్రజా సమస్యల ప్రస్తావన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
ఇందులో భాగంగా.. గ్రామాలన్నీ తిరుగుతూ వివిధ పార్టీల నాయకులు, ప్రజలతో చర్చించి, ప్రధాన సమస్యలను గుర్తించి, వాటిని గ్రామంలోని ఒక గోడపై రాస్తున్నారు, గోడకు ఎరుపు రంగు వేసి దానిపై తెలుపు రంగులో సమస్యలను రాస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో జనసేన నాయకుడు కస్తూరి సత్య ప్రసాద్ (నాని) ఈ రెడ్ రెవల్యూషన్కు నాయకత్వం వహిస్తున్నారు. ‘మా రెడ్ రెవల్యూషన్ టీం గుర్తించిన సమస్యలన్నింటినీ పార్టీలు తమ ఎన్నికల మానిఫెస్టోలో తప్పనిసరిగా చేర్చాలని మేం డిమాండ్ చేస్తున్నాం.
ఈ సమస్యలకు పరిష్కారం దొరికే వరకు, వార్షిక రాష్ట్ర బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించే వరకు మా పోరాటం కొనసాగుతుంది’ అని కస్తూరి నాని స్పష్టం చేశారు. ఈ ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాలని జనసేన భావిస్తోంది. గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి కొంత సానుకూలత ఉంది. పవన్ కల్యాణ్ను బాగా ఓన్ చేసుకునే కాపు సామాజికవర్గం ఓట్లు ఈ జిల్లాల్లో గణనీయంగా ఉన్నాయి. అయితే కాపు ఓట్లపై అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు కూడా కొంత ఆశలున్నాయి. కాపు సామాజికవర్గంలో మెజారిటీ మంది మాత్రం జనసేన వైపునే నిలిచే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more