ప్రభుత్వ కార్యాలయాల్లో తమ పనులు చకచకా జరుకునేందుకు కొందరు అక్రమార్కులు బల్ల కింద చేయ్యి పెట్టే అలవాటు వున్న కొందరు అధికారులకు నిర్మోహమాటంగా కాసులను అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విధానాలు చెల్లాయి కానీ.. ఇకపై మాత్రం చెల్లవు. ఎందుకంటారా.. ఇప్పటి వరకు ప్రభుత్వాధికారులు లంచం పుచ్చుకోవడం మాత్రమే నేరం. కానీ ఇప్పుడు లంచం ఇవ్వడం కూడా నేరమే. ఈ మేరకు అవినీతి నిరోధక చట్టానికి చేసిన సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.
అవినీతి నిరోధక చట్టంలో కొన్ని నిబంధనలను సవరిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభ మూజువాణి పద్ధతిలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. సవరించిన చట్టం ప్రకారం.. ఇకపై లంచం ఇచ్చే వారిని కూడా నేరస్తులుగానే పరిగణిస్తారు. గరిష్టంగా ఏడేళ్లు, కనిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. వ్యక్తులు, సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. అవినీతి కేసుల్లో సత్వర విచారణతోపాటు, దుర్బుద్ధితోచేసే ఫిర్యాదుల నుంచి పదవీ విరమణ చేసిన అధికారులకు రక్షణ కల్పించేందుకు బిల్లులో కొన్ని సవరణలు చేశారు.
లంచం ఇచ్చే విషయంలోనూ కొన్ని మినహాయింపులు ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో లంచం ఇవ్వాల్సి వస్తే, అది జరిగిన ఏడు రోజుల లోపు విచారణ సంస్థలకు సమాచారం అందించవచ్చు. తద్వారా శిక్ష నుంచి బయటపడవచ్చు. ఈ గడువును మరింత పెంచాలని కేంద్రం యోచిస్తోంది. కాగా, బిల్లుకు ఆమోద ముద్రపడిన అనంతరం కేంద్రమంత్రి జితేంద్రసింగ్ మాట్లాడుతూ దీనినో చారిత్రక బిల్లుగా అభివర్ణించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more