గులాబీ రంగులో 2000 రూపాయల నోటు.. పసుపు రంగులో 200 రూపాయల నోటు.. ఆకుపచ్చ రంగులో 50 రూపాయల నోటు.. చాక్లెట్ రంగులో 10 రూపాయల నోటు.. ఇలా విభిన్న రంగుల్లో కొత్త కొత్త నోట్లను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పెద్ద నోట్లను రద్దు తర్వాత నకిలీలకు తావులేకుండా ఈ నోట్లలో సెక్యురిటీని మరింత పెంచుతూ తీసుకొచ్చింది. తాజాగా వంద రూపాయల కొత్త నోటును కూడా ఆర్బీఐ తీసుకొస్తోందట. వచ్చే నెలలో ఈ కొత్త నోటును ప్రవేశపెట్టబోతుందని ‘బిజినెస్ న్యూస్’ రిపోర్టు చేసింది. ఈ నోటు ముదురు నీలం రంగులో ఉంటుందని తెలిపింది.
కొత్త వంద రూపాయల నోట్లు వచ్చినప్పటికీ, ప్రస్తుతం చలామణిలో ఉన్న వంద రూపాయల నోట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కొత్త రూ.100 నోటుకు ప్రింటింగ్ ప్రెస్ వద్ద తుది ఆమోదం లభించిందని, రెండు వేల రూపాయల నోట్లు ప్రింట్ చేసే దగ్గరే, ఈ కొత్త వంద రూపాయల నోట్లను ప్రింట్ చేస్తున్నట్టు బిజినెస్ న్యూస్ రిపోర్టు చేసింది. విదేశీ ఇంక్తో దివాస్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద ఈ నోట్ల ప్రింటింగ్ కూడా ప్రారంభమైందట.
కొత్త నోట్లకు అనుగుణంగా బ్యాంకులు తమ ఏటీఎంలలో మార్పులు కూడా చేపడుతున్నాయని తెలిసింది. కాగా, 2017 ఆగస్టులోనే ఆర్బీఐ కొత్త 200 రూపాయల నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నోటు ముందు భాగం కుడివైపు చివరన అశోక స్థూపాన్ని ముద్రించారు. మహత్మా గాంధీ కొత్త సిరీస్ తో ఈ నోటు మార్కెట్లోకి వచ్చింది. దేవనాగరి లిపిలో రూ 200 అంకెను నోటు ముందు, వెనుక భాగంలో ముద్రించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more