డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడకూడదని అటు పోలీసుల, ఇటు పెద్దలు అనేక పర్యాయాలు చెబుతూనే వుంటారు. అయినా నిత్యం చేసే పనేగా కొత్తగా ఏం చేస్తున్నామంటూ పెద్దల మాటలను, పోలీసుల హెచ్చరికలను పెడచెవిన పెడుతుంటారు యువత. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ మోగ్రినా తీయకపోవడమే మంచిదని, ఫోన్ లో సంబాషించిన తరువాతే డ్రైవింగ్ చేస్తే బాగుంటుందని కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఎంత అప్రమత్తంగా వ్యవహరించినా.. ప్రమాదమన్నది చెప్పిరాదన్న పెద్దల మాట.. ఈ ఘటన ద్వారా నిరూపితమైంది.
సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి నిర్లక్ష్యం ప్రాణాలున్నా నిర్జీవిని చేసింది. స్థానికంగా వున్న సీసీటీవీల్లో నిక్షిప్తమైన ఈ ఘటన దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఫోన్ మాట్లలాుడతూ.. రాంగ్ రూట్ లో వెళ్లిన వ్యక్తి ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయ్యింది. అధికారులు, పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా తగిన జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం ఏ రూపంలో పొంచి ఉంటుందో చెప్పలేం. సరిగ్గా హైదరాబాద్లో ఇలాంటి విషాదం ఒకటి చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఖాజా మొహినుద్దీన్(35) నగరంలోని బహదుర్పురలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ పని మీద బయటకు వెళ్లాడు. తొలుత నో పార్కింగ్ ప్లేస్లో బైక్ పార్క్ చేసిన ఖాజా ఆపై ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడుపుతున్నాడు. సెల్ఫోన్లో మాట్లాడుతున్న అతడు బహదుర్పురా నాలా సమీపంలో రాంగ్రూట్లో రోడ్డు క్రాస్ చేసేందుకు చూడగా ఖాజా బైక్ను మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఖాజా తల నేరుగా రోడ్డుకి గట్టిగా తాకడంలో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. హాస్పిటల్కు తరలించగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలిపారు. హెల్మెట్ ధరించక పోవడంతో పాటు సెల్ఫోన్లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనం నడపటం వల్లే ఖాజాకు బ్రెయిన్ డెడ్ అయిందని పోలీసులు తెలిపారు. ఈ వీడియో వైరల్గా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more