కేంద్రంతో పాటు దేశంలోని అధిక రాష్ట్రాల్లో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు తమిళలో మాత్రం చుక్కెదురైంది. తమిళనాడులో కూడా తాము అధికారంలోకి రావాలన్న వ్యూహాలకు పదను పెట్టిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా.. ఈ సందర్భంగా తమిళనాడు రాజధాని చెన్నైలో అడుగుపెట్టిన సందర్భంగా అక్కడి యువత తడాఖా చూపించింది. ఒక రోజు పర్యటన నిమిత్తం చెన్నై వచ్చిన ఆయనపై ‘గో బ్యాక్’ అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. సామాజిక మాధ్యమాల నిండా నిరసనలు వెల్లువెత్తడంతో బీజేపీ కంగుతింది.
చెన్నై మహానగరంలో అడుగుపెట్టిన అమిత్ షా పర్యటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన నెటిజన్లు ‘గో బ్యాక్ అమిత్ షా’ హ్యాష్ట్యాగ్తో సామాజిక మాధ్యమాలను హోరెత్తించారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఆయనకు ఎక్కడా ఎదురవ్వని పరాభవం తమిళనాట ఎదురైంది. తమిళనాడు యువత ‘గో బ్యాక్ అమిత్ షా’ హ్యాష్ ట్యాగ్ ట్వీట్లు, రీట్వీట్లతో విరుచుకుపడింది దీంతో అమిత్ షాను ఇన్నాళ్లుగా మోసిన ట్విట్టర్ లోనే ఆయన ఒక్కసారిగా విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ అనూహ్య పరిస్థితులు ఉత్పన్నం కావడంతో బీజేపీ శ్రేణులకు ఏం చేయాలో పాలుపోలేదు.
అమిత్ షా రాకను అడ్డుకునేలా ఏకంగా 1.29 లక్షల మంది వ్యతిరేకిస్తూ ట్యాగ్ చేశారు. ఫలితంగా ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతున్న వాటిలోనే ఆయన ఏకంగా రెండో స్థానంలో నిలిచారు. తమిళ గడ్డపైకి అమిత్ షా లాంటి ఉగ్రవాదిని అడుగుపెట్టనీయబోమని కొందరు హెచ్చరించారు. ఇది తమిళనాడు అన్న సంగతిని ఆయన గుర్తుంచుకుంటే మంచిదని కొందరు, ప్రజాస్వామ్య గ్యాంబ్లర్ ను తాము అంగీకరించబోమని మరికొందరు కామెంట్ చేశారు. నోట్ల రద్దు స్కామ్ స్టార్ గో బ్యాక్ అని ఇంకొందరు అమిత్ షాపై విరుచుకుపడ్డారు. తూత్తుకూడి మారణహోమం నేపథ్యంలో ట్వీట్ చేయని అమిత్ షా ఇప్పుడెందుకు వస్తున్నారని ఇంకోందరు.. ఇలా లక్షలాదిమంది అమిత్ షాకు వ్యతిరేకంగా గళమెత్తడాన్ని రాష్ట్ర పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more