కేరళలో నకిలీ నోట్లతో పట్టుబడిన ప్రముఖ టీవీ అర్టిస్టు సూర్యా శశికుమార్.. వెనుక తనకు తానుగా దైవాంశసంభూతుడిగా పరిచయం చేసుకున్న ఓ స్వామీజీ హస్తం కూడా వున్నట్లు తెలుస్తుంది. మలయాళ చిత్రసీమ రంగంలోని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్న స్యూర శశికుమార్ ను ఆయన టార్గెట్ గా చేసుకుని ఆమెకు అధిక లాభాలు ఆశచూపి గుట్టుగా వుండేందుకు అమె ఇంట్లోనే పైపోర్షన్ లో ఈ వ్యాపారాన్ని సాగించాడని సమాచారం. పోలీసులు దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది.
నకిలీ కరెన్సీ నోట్ల కేసులో సూర్య శశికుమార్ సహా అమె తల్లి, సోదరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా వారిని వేర్వేరుగా విచారిస్తున్న క్రమంలో ఈ వివరాలు బయటపడ్డాయి. స్వయం ప్రకటిత దైవాంశసంభూతుడిగా పరిచయం చేసుకున్న బీజూ అనే ఓ దొంగ స్వామీజీ .. సూర్య శశికుమార్ కు మలయాళ చిత్రరంగంతో పాటు పలు వ్యాపార వేత్తలతో పరిచయాలు వున్నాయని గ్రహించి అమెతో నకిలీ కరెన్సీ నోట్ల వ్యాపారానికి తెరతీయించాడని విచారణలో సూర్యశశికుమార్ తెలిపారు. ఆమెకు ముఠాతో సంబంధాలు ఏర్పాటు చేయించింది కూడా బీజునేని పోలీసులు తేల్చారు.
ఒక్క కేరళకే ఆమె దొంగ నోట్లు పరిమితం కాలేదని, తమిళనాడులోనూ వాటిని చలామణిలోకి తేవడానికి ఏజంట్లతో ఒప్పందం కుదుర్చుకుందని విచారణలో గుర్తించిన పోలీసులు, తమ దర్యాఫ్తును పక్క రాష్ట్రానికి విస్తరించాలని నిర్ణయించారు. కాగా, కొద్ది రోజుల క్రితం రూ. 2.50 లక్షల నకిలీ కరెన్సీతో తమకు పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను విచారించిన పోలీసులు ఆపై సూర్యా శశికుమార్ ఇంట్లో తనిఖీ చేయగా, రూ. 57 లక్షల విలువైన నకిలీ నోట్లు లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన మాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపగా, ప్రస్తుతం ఆమెతో పాటు ఆమె తల్లి రమాదేవి, సోదరి శృతిలను పోలీసులు విచారిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more