ఢిల్లీలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది డెత్ మిస్టరీపై... దర్యాప్తు చేస్తున్న కొద్దీ విస్తుపోయే విషయాలు బయట పడుతున్నాయి. వీరంతా ముందుగానే ప్లాన్ చేసుకుని సామూహిక ఆత్మహత్యలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో లభించిన నోట్స్ల ఆధారంగా ఈ ఘోరానికి క్షుద్ర పూజలే అనుమానిస్తుండగా... దీన్ని బలపరుస్తూ మరో కీలక విషయాన్ని అధికారులు వెలుగులోకి తెచ్చారు.
ఆ ఇంట్లో అనుమానాస్పదంగా పెట్టి ఉంచిన 11 పైపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృత దేహాలు వేలాడుతున్న తీరుకు, పైపులు పెట్టిన స్థానాలకు సరిగ్గా సరిపోలుతుండడం మరింత అనుమానం రేపుతోంది. అందులో నాలుగు పైపులు పెద్దవిగా, మిగతావి చిన్నగా ఉండడంతో... ఆ నాలుగు పైపులు మగవాళ్లను, మిగతావి మహిళలను సూచించడానికే పెట్టారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఒక పైపు దూరంగా పెట్టి ఉంచడంతో... ఈ పైపుకి, మిగతా మృతదేహాలకు దూరంగా ఫ్లోర్పై కనిపించిన వృద్దురాలి మృతదేహానికి సంబంధం ఉందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు కథనం ప్రకారం.. ఆ ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న రెండు రిజిస్టర్లలో మోక్షం పొందడం గురించి ఏవేవో రాసి ఉన్నాయి. కుటుంబ సభ్యులంతా ఎలా ఆత్మహత్య చేసుకోవాలో చెబుతూ అందులో స్పష్టంగా రాసినట్టు సమాచారం. మోక్షం కోసం ఆ కుటుంబం చేస్తున్న ప్రార్థనలకు, వీరి మరణాలకు కూడా సంబంధం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. 2015 నుంచి ఈ కుటుంబం రిజిస్టర్లో రాస్తున్నారనీ.. తాము మరణించబోయే తేదీని కూడా అందులో రాశారని సమాచారం.
ఈ ఘటనపై వారి బంధువులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ వాళ్లంతా విద్యావంతులని, మూఢ నమ్మకాలను పాటించరని అంటున్నారు. దీనిపై మృతురాలు నారాయణ్ దేవి మనవడు కేతన్ నాగ్పాల్ స్పందింస్తూ.. తమ కుటుంబానికి ఆర్థిక సమస్యలేమీ లేవని అలాంటిప్పుడు ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడతారని ప్రశ్నించారు. ఇవి ముమ్మాటికీ హత్యలేనని అతడు అనుమానం వ్యక్తంచేశాడు. వారికి మూఢ విశ్వాసాలపై నమ్మకం లేదని, ఒకవేళ ఆత్మహత్యలు చేసుకుంటే ముఖాన్ని, నోర్లను, చేతులను కట్టేసుకుంటారా అని నిలదీశారు. కాగా ఈ కేసును విచారిస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఇవి సామూహిక హత్యలా, లేక ఆత్మహత్యలా అనేదానిపై విచారించేందుకు ఏ ఒక్క కోణాన్ని విడిచిపెట్టడం లేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more