మూడు రోజుల క్రితం అంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్.. జనసేన అధినేతతో భేటీ కావడం చర్చనీయాంశంగగా మారింది. తాజాగా.. మధ్యతరగతి విద్యావంతులు, మేధావులు, క్రీడాకారులు రాజకీయాల్లోకి రావాలని పవన్ కల్యాన్ ఇచ్చిన పిలుపుతో ఆయా వర్గ ప్రజల్లో కదలిక మొదలైంది. ఇవాళ జనసేన పార్టీలోకి టీమిండియా మాజీ ఆటగాడు, ఆంధ్ర క్రికెటర్ వేణుగోపాలరావు చేరారు. ఆయనను పవన్ కల్యాన్ పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి అహ్వానించారు.
వేణుగోపాలరావుతో పాటు మరికొంతమంది నాయకులు విశాఖపట్నంలో అధినేత పవన్ కళ్యాణ్ అధ్వర్యంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేనలో చేరినవారిలో వేణుగోపాల్రావుతో పాటు బీసీ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ కోన తాతారావు (గాజువాక), అనకాపల్లికి చెందిన వ్యాపారవేత్త కొణతాల సీతారాం, విశాఖ నగరానికి చెందిన బాలాజీ స్కూల్స్ అధినేత మండవ రవికుమార్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రామచంద్రరావు ఉన్నారు. ఈ నాయకులతో పాటు వారి అనుచరులు కూడా జనసేనలో చేరారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘2019లో సరికొత్త రాజకీయ వ్యవస్థ రాబోతోంది. ప్రతి నియోజకవర్గంలో జనసేన జెండా రెపరెపలాడుతుంది. జనసేన పార్టీకి జీవం జనసైనికులే. నాయకులు ఉండొచ్చు, వెళ్లిపోవచ్చు.. కానీ, జనసైనికులు ఎప్పుడూ నాతోనే ఉంటారు. టీడీపీ, వైసీపీలకు డబ్బులిస్తే జనం వస్తారు. జనసేనకు మాత్రం స్వచ్ఛందంగా, ప్రేమతో వస్తారు. జనసైనికులు డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తులు కాదు. జనసేన పార్టీలో చేరిన నాయకులు జనసైనికుల్ని గౌరవించాలి. వారిని గౌరవిస్తే.. నన్ను గౌరవించినట్లే. ఇన్ని సంవత్సరాలు ఇంత ప్రేమను పంచిన మీకు.. నా తుది శ్వాస వరకు వెన్నంటే ఉంటాను. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాను’ అని చెప్పారు.
ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం కాదని, వెనక్కి నెట్టివేసిన ప్రాంతమని పవన్ కల్యాణ్ అన్నారు. ఉత్తరాంధ్ర యాస, భాష, కళలతో పాటు ఆత్మను అర్థం చేసుకున్న ఏకైక పార్టీ జనసేన మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత స్వరూపాన్ని, స్వభావాన్ని అర్థం చేసుకున్న స్థానిక నాయకులకే జనసేన పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. ‘ఇవాళ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. 2003లో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకన్నా. 2009లో పోటీ చేయకపోవడానికి ముఖ్య కారణం సమస్యలను అర్థం చేసుకోవడం కోసమే. 2014లో సుస్థిరత కోసం టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు ఇచ్చాను. రాజకీయాల్లో లబ్ధి పొందాలనుకుంటే ఆనాడే కేంద్ర మంత్రి పదవి అడిగేవాడిని. టీడీపీకి మద్దతు ఇచ్చినందుకు బేరసారాలు ఆడేవాడిని. కానీ దేశ రాజకీయాల్లో విలువలు బతికే ఉన్నాయని చెప్పడానకి అవేవీ ఆశించకుండా మద్దతు పలికాను’ అని పవన్ వెల్లడించారు.
జనసైనికుల కోసం జులై 2 నుంచి జనసేన శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయని జనసేనాని ప్రకటించారు. ప్రతి జిల్లా నుంచి మూడు వేల మందిని శిక్షణ కోసం ఎంపిక చేశామన్నారు. ‘ఎవరైనా రాజకీయాల్లోకి రాగానే పదవిని కోరుకుంటున్నారు. నేను మాత్రం సమస్యలకు పరిష్కారం వెకతడం కోసం వచ్చాను. ఈ పనిని ఉద్దానం నుంచే మొదలుపెట్టాను. త్రికరణ శుద్ధితో చాలా సహనంతో రాజకీయాల్లో ఉంటున్నా. నాకు చాలా ఓపిక ఎక్కువ. ఎంత ఓపిక అంటే ఒక సినిమా హిట్ కోసం 12 ఏళ్లు ఎదురుచూశా. 2019లో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. అందులో భాగంగానే మన నాయకులంతా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. మేధావుల సలహాలు, సంప్రదింపులతో జనసేన మ్యానిఫెస్టో రూపుదిద్దుకుంటోంది’ అని పవన్ వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more