అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం రేపాయి. అగ్రరాజ్యంలోని మేరీలాండ్ రాష్ట్రంలో అన్నాపోలిస్ నుంచి ప్రచురితమయ్యే ‘క్యాపిటల్ గెజిట్’ దినపత్రికా కార్యాలయంలో చోచ్చుకోచ్చిన అగంతకుడు విఛక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ‘గ్లాస్ డోర్ నుంచి గన్మెన్ ఒకరు తుపాకీతో విచక్షణారహితంగా కాల్చాడు. ఒక్కసారిగా అక్కడి వారంతా భీతిల్లారు. భయంతో పలువురు బల్లల కింద దాక్కున్నారు’ అని ఫిల్ డేవిస్ అనే రిపోర్టర్ ట్వీట్ చేశాడు.
అన్నాపోలీస్లో నాలుగు అంతస్తుల భవనంలో ఈ పత్రికా కార్యాలయం ఉంది. కాల్పుల సంఘటన అనంతరం పోలీసులు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, తాను కాల్పులకు తెగబడతానని అగంతకుడు ముందునుంచి పత్రికావర్గాలను సామాజిక మాధ్యమం ద్వారా హెచ్చరిస్తూనే వున్నాడని కూడా సమాచారం. ఈ కాల్పుల్లో వెండి వింటర్స్, జాన్ మెక్ నమరా, జెరాల్డ్ పిక్చ్ మెన్; రెబఖా స్మిత్, రాబ్ హైయాసెన్ అనే పాత్రికేయులు మరణించారు.
కాల్పుల జరిపిన అగంతకుడిని జర్రోడ్ రామోస్ గా గుర్తించిన పోలీసులు అతడికి ముప్పై ఏళ్లు వుంటాయని చెప్పారు. అయితే రామోస్ కు ఈ దినపత్రికతో సుదీర్ఘ వివాదమే వుందని సమాచారం. గతంలో అతను చేసిన ఓ నేరానికి సంబంధించిన కథనాన్ని ప్రచురించడంతో.. దానిపై అతను కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో అతను దినపత్రిక కార్యాలయంపై దాడులు చేస్తానని సోషల్ మీడియా ద్వారా ముందునుంచి హెచ్చరికలు చేస్తున్నా.. పత్రికా కార్యాలయం వర్గాలు మాత్రం వాటిని తేలిగ్గా తీసుకున్నాయి. ఈ ఘటనపై అధ్యక్షుడు ట్రంప్కు సమాచారం అందించినట్లు వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి.
Video from the 8 pm press conference. This was a targeted attack on my newsroom, police said. pic.twitter.com/ByEnWbY5Py
— Chase Cook (@chaseacook) June 29, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more