నిజామాబాద్ టీఆర్ఎస్ లో లుకలుకలు వెలుగుచూశాయి. సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ టీఆర్ఎస్ నేతలు అరోపిస్తున్నారు. గత మూడు రోజులుగా ఆయన హస్తినలో మాకాం వేసిన నేపథ్యంలో ఆయన తన తనయుడి మాదిరిగానే కాషాయపార్టీ తీర్థం తీసుకోనున్నారా..? లేక మళ్లీ తన మాత్రపార్టీ కాంగ్రెస్ లో చేరనున్నారా.? అన్న వార్తలు వస్తున్న వేళ.. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు హుటాహుటిన భేటీ అయ్యి.. ఆయనను పార్టీ నుంచి తప్పించడమే కాకుండా క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు ఎంపీ కవిత నేతృత్వంలో, అమె నివాసంలో జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు భేటీ అయ్యి డీఎస్ వ్యవహారశైలిపై చర్చించారు. డి.శ్రీనివాస్ కుమారుడు ఇటీవల బీజేపిలో చేరడంతో ఆయన కూడా ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా ఉన్న డీఎస్ పార్టీలోకి వస్తానంటే సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి.. ఆయన పెద్దరికాన్ని గౌరవించి.. అంతర్రాష్ట్ర సలహాదారుగా కూడా నియమించి కేబినెట్ హోదా కల్పించారని చెప్పారు. ఆ తరువాత ఆయనకు రాజ్యసభ కూడా పంపారని అన్నారు.
సీఎం ఆదేశాల మేరకు జిల్లా నేతలంతా ఆయనకు సముచిత గౌరవం ఇస్తూ వచ్చారు. అన్ని ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ఆయనను అహ్వానిస్తూ వచ్చినా.. ఆయన మాత్రం ఆ పెద్దరికం నిలుపుకోలేక పోయారని.. తన కుమారుడు బీజేపిలో చేరిననాటి నుంచి ఆయనలో మార్పు వచ్చిందని.. దీంతో బీజేపికి అనుకూలంగా పనిచేయాలంటూ ఆరేడు నెలలుగా డీఎస్ టీఆర్ఎస్ కార్యకర్తలను ఒత్తిడి చేస్తున్నారని అరోపించారు. ఈ విషయాన్ని పలువురు కార్యకర్తలు తమ దృష్టికి తీసుకొచ్చారని.. దీంతోనే తాము బయటకు రావాల్సివచ్చిందని అమె అన్నారు.
పార్టీకి వ్యతిరేకంగా డీఎస్ వ్యవహరిస్తున్న తీరును అధిష్ఠానానికి తెలియజేయాల్సిందిగా నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు తుల ఉమకు విజ్ఞప్తి చేశామని.. ఇప్పటికే తమ ఆవేదనను తెలియజేస్తూ సీఎం కేసీఆర్కు లేఖ రాశామని చెప్పారు. పార్టీలో ఇలాంటి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తేనే వచ్చే ఎన్నికల్లోనూ నిజామాబాద్ జిల్లా మొత్తం టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుందని ఆమె అశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ క్రమశిక్షణ కలిగిన పార్టీ. పార్టీలో ఎంతటి నాయకులైనా సరే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించవద్దని అధినేతను కోరుతున్నాం’ అని కవిత అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more