తనను అకారణంగా విధుల నుంచి అకస్మాత్తుగా తప్పించారని గత నెల రోజులుగా రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారిన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇవాళ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. టీటీడీ పాలక మండలి అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చినందుకే.. వయో పరిమితి నిబంధనను టీటీడీ కమిటీ భేటీలో అకస్మాత్తుగా చేర్చి.. దానిపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని అమోదించారని, ఇలా అమోదించగానే దానిని తక్షణం అమల్లోకి తీసుకువచ్చారని ఆయన తన అవేదనను జగన్ కు వివరించారు.
హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్ నివాసానికి వచ్చిన రమణ దీక్షితులు ఆయనతో భేటీ అయ్యి పలు విషయాలపై చర్చించినట్ల సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డుపై రమణ దీక్షితులు తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. రహస్య తవ్వకాలతో పాటు శ్రీవారికి చెందిన పింక్ వజ్రం గురించి ఆయన లేవనెత్తిన పలు అంశాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. రమణ దీక్షితులపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలాగే టీటీడీ బోర్డు కూడా రమణ దీక్షితుల వైఖరిని ఖండిచడమే గాకుండా... న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జగన్ ను రమణ దీక్షితులు భేటీ కావడం సంచలనం రేపుతోంది.
ఆ తరువాత రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ... "మా కష్టాలు చెప్పుకోవడానికి వచ్చాను.. ఈ చట్టాల వల్ల టీటీడీలో చాలా కష్టపడుతున్నాము.. మాకు ఉన్న సౌకర్యాలన్నింటినీ తీసేశారు. మమ్మల్ని హింసిస్తున్నారు. ఈ విషయాన్ని చెప్పుకోవడానికే వచ్చాను. మా కష్టాలు చెప్పుకోవడానికి కూడా కొందరు అవకాశం ఇవ్వలేదు. చాలా సార్లు విజయవాడకు వెళ్లి వచ్చాము.. మా కష్టాలు వినలేదు.. ఆకలిగా ఉన్నవాడు ఎవరు అన్నం పెడుతున్నారనేది చూడడు.. అన్నం పెడుతున్నాడా? లేడా? అన్నదే చూస్తాడు. మా కష్టాలు తీర్చేవారే కావాలి.. సీఎం చంద్రబాబును మా కష్టాలు తీర్చమనండి.. ఆయన ఫొటోను మా ఇంట్లో పెట్టుకుంటాము. మాకు కావాల్సింది ప్రశాంతంగా స్వామి వారి పూజ చేసుకోవడం. స్వామి వారి సొత్తును, పవిత్రతను కాపాడడం నాకు జన్మతః వచ్చిన హక్కు అది.. నేను పోరాడుతూనే ఉంటాను" అని వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more