వారంతపు సెలవుల్లో సరదా తన కుటుంబసభ్యులు, మిత్రులతో కలసి వాటర్ ఫాల్స్ కు వెళ్లిన ఓ శాస్త్రవేత్త.. తన భార్య పిల్లల కళ్ల ఎదుటే కానరానీ లోకాలకు తరలివెళ్లడం విషాదాన్ని నింపింది. హర్యానాకు చెందిన సోమశేఖర్ అనే శాస్త్రవేత్త.. వారంతంలో తన కుటుంభంతో పాటు పలువురు స్నేహితులతో కలసి కర్ణాటకలోని మైసూరు జిల్లా చుంచనకట్టె జలపాతానికి వచ్చారు. అక్కడికి వారు చేరుకున్న సమయంలో నదిలో నీళ్లు లేకపోవడంతో నది ప్రవహించే ప్రాంతంలో రాళ్లపైకి తన భార్యా పిల్లలతో కలసి వెళ్లారు.
అయితే అకస్మాత్తుగా నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో అప్రమత్తమైన సోమశేఖర్ తన భార్య ప్రతిమతో పాటు ఒక బిడ్డను గట్టుకు చేర్చాడు. ఇంతలో నీటి ప్రవాహం పెరగసాగింది. దీంతో నీళ్లలోనే ఒక చిన్నారితో పాటు ఆయన కూడా నీటిలోనే చిక్కకుపోయారు. అయితే వారిని చూసిన పలువరు స్థానికులు వారిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ముందుగా చిన్నారిని రక్షించిన వాళ్లు.. అనంతరం పోమశేఖర్ ను రక్షించేందుకు తాడును విసిరారు. అయితే దానిని అందుకున్న అయన దానిని నడుముకు కట్టుకునే లోపు కాలు జారి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
కాగా, కేకేనగర్ హైడల్ పవర్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తిని ముగించే క్రమంలో ప్రమాద సూచకంగా ఓ సైరన్ ను మ్రోగించి.. నదిలోని వారు బయటకు రావాలని హెచ్చరికలు చేసింది. అనంతరం నీటిని వదిలింది. అయితే హైడల్ యూనిట్ మ్రోగించిన సైరన్ తమకు వినిపించలేదని అక్కడ వున్న మిగతా టూరిస్టులు కూడా చెబుతున్నారు. యూనిట్ ప్రాంతంలో అలారమ్ మ్రోగించడం ద్వారా లాభం వుండదని, నదీ ప్రాంతంలోని టూరిస్టులకు వినిపించేలా అలారమ్ ఏర్పాటు చేయాలని పలువరు టూరిస్టులు కొరుతున్నారు.
#Warning: the visuals may be disturbing for some; viewer discretion advised.
A scientist from #Bengaluru, who was working in CFTRI in #Mysuru was washed away in the gushing waters of the #Cauvery river at #Chinchanakatte water falls on Sunday. pic.twitter.com/qHOGj57zVr
— Bangalore Mirror (@BangaloreMirror) June 3, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more