ఆన్ లైన్ లో రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు శుభవార్త..! ఇకపై ఆన్ లైన్ రిజర్వు చేసుకునే టిక్కెట్ కు.. వెయిటింగ్ లిస్టు నంబరుతో పాటు.. బెర్త్ ఖరారయ్యే అవకాశముందా? లేదా..? వుంటే.. అది ఏ బెర్త్ రావొచ్చు? లోయర్, మిడిల్, అప్పర్ బెర్తా లేక ఆర్ఏసీనా? అనే సమాచారం కూడా ముందుగానే అందనుంది. దీంతో ప్రయాణికులు ఇతర రైళ్లలో సీటు లభ్యమయ్యే అవకాశం వున్నపక్షంలో ముందుగా రిజర్వు చేసుకున్న టికెట్లను రద్దు చేసుకునే వెసలుబాటు కూడా అందించినట్లే.
గడిచిన 13 ఏళ్ల రిజర్వేషన్ల వివరాలతో ‘డేటా మైనింగ్’ పరిజ్ఞానం ద్వారా భారత రైల్వే కేటరింగ్, పర్యాటక సంస్థ (ఐఆర్సీటీసీ) కొత్త సదుపాయాన్ని అమల్లోకి తెచ్చింది. అర్ధరాత్రి నుంచే తన వెబ్ సైట్లో ఈ సుదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘డేటా మైనింగ్ అనగానే.. డేటా తస్కరణ వంటి అనుమానాలతో ప్రయాణికులు హైరానాపడాల్సిన అవసరం లేదు. ఈ పరిజ్ఞానాన్ని రైల్వే సమాచారవ్యవస్థ కేంద్రం (సీఆర్ఐఎస్) రూపొందించింది. గడిచిన 13 ఏళ్ల డేటా ఆధారంగా.. ప్రత్యేకంగా రూపొందించిన అల్గారిథమ్.. ఎప్పటికప్పుడు మారే బుకింగ్ ట్రెండ్స్ ద్వారా ప్రయాణికులకు ముందుగానే బెర్త్ ఖరారయ్యే విషయాన్ని తెలియజేయవచ్చు. దీనిద్వారా చూచాయగా ఔట్ పుట్ ఏమిటనేది తెలుస్తుందని రైల్వే అధికారులు పేర్కోంటున్నారు.
దీనివల్ల ప్రయాణికులు తరచూ ఐఆర్సీటీసీ సైట్లోకి వెళ్లి.. పీఎన్ఆర్ స్టేటస్ చూసుకునే అవసరం కూడా తప్పినట్లు అయ్యింది. ఈ సదుపాయంతో రైల్వే సైటుకు తరచూ వచ్చే కస్టమర్ల సంఖ్య కూడా తగ్గుతుందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. దీంతోపాటు.. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో టికెట్ బుకింగ్ వ్యవస్థను మరింత సులభతరం చేసినట్లు వివరించారు. ‘ఆన్లైన్ టికెట్ బుకింగ్ సమయంలో ప్రస్తుతమున్న ఫార్మాట్ను పూర్తిగా మార్చేశాం. ఆయా కాలమ్స్లో ఆటోఫిల్ డేటా ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులు ప్రతి కాలాన్ని నింపాల్సిన అవసరం లేదు. పేమెంట్ ఆప్షన్ వద్ద కూడా యూజర్లు ముందుగానే ఆరు బ్యాంకుల వివరాలను నమోదు చేసుకోవచ్చు’ అని వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more