Congress MLA passed away in a road accident కాంగ్రెస్ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం.. సిద్దూ న్యామగౌడ దుర్మరణం

Karnataka mla siddu nyama gowda passed away in a road accident

congress mla, congress karnataka mla, congress mla in karnataka, congress mla list, Siddu Nyama Gowda, Siddu B Nyamagouda, Jamkhandi constituency, congress party, congress news, accident news, accident case, accident car, car accident in india, car accident news report, car accident report, road accident, road accident in india, road accident in india report, road accident news report, Siddaramaiah, Congress, BJP, JDS, Kumara Swamy, PM Modi, Amit shah, karnataka, politics

karnataka Congress MLA Siddu Nyama Gowda died today after his vehicle met with an accident at Tulasigeri in Karnataka, he was on his way from Goa to Bagalkot, the report says.

కాంగ్రెస్ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం.. సిద్దూ న్యామగౌడ దుర్మరణం

Posted: 05/28/2018 11:00 AM IST
Karnataka mla siddu nyama gowda passed away in a road accident

అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన సిద్ధు న్యామగౌడను విధి వెక్కిరించింది. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకరం చేసి వారం రోజులుకూడా తిరక్కుండానే ఆయనను విధి వంచించింది. ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. గోవా వెళ్లిన ఆయన, తిరుగు ప్రయాణంలో బాగల్ కోట్ వస్తుండగా, తులసిగెరి వద్ద ఆయన కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయిన సిద్ధును వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆయన ప్రాణాలు మిగల్లేదు.

అయితే తాను ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ఎడమ వైపునున్న ముందు టైరు బస్ట్ అవ్వడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. కారు టైరు అకస్మాత్తుగా బస్ట్ అవ్వడంతో కారు అదుపుతప్పి పక్కనున్న గోడను బలంగా ఢీకొనింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలు కాగా, అస్పత్రికి తరలించేక్రమంలోనే ఆయన తన తుదిశ్వాసను విడిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఆ సమయంలో కారు కూడా అతివేగంగా వున్నట్లు కూడా సమాచారం.

కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ నేతగా సిద్ధు న్యామగౌడ తనదైన ముద్ర వేసుకున్నాడు. రాష్ట్రస్థాయి నేతగా కూడా ఎదిగిన ఆయన ప్రస్తుతం జామ్ ఖండీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో ఆయన బగల్ కోట్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కూడా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై.. కేంద్ర బొగ్గుశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. తమ ఎమ్మెల్యే మృతిపై కాంగ్రెస్ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఇక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆయన కుటుంబసభ్యులకు సిద్దరామయ్య తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles