నీకు ఇంకా భూమ్మిత నూకలు బాకీ వున్నాయిరా..? అంటూ పాతకాలపు పెద్దలు ఎవరైనా వుంటూ ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే అదే మాట అంటారు. ఎందుకంటలే రైలు ఢీ కొట్టిన తరువాత కూడా ప్రాణాలతో బతికి బయటపడ్డాడంటే అశ్చర్యపడక తప్పదు కదా. దేశ రాజధానిలో జరిగిన ఈ తరహా ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సిసిటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైయ్యాయి. అవికాస్తా సోషల్ మీడియాలో పోస్టు కావడంతో.. నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
ఓ యువకుడు.. మెట్రో రైల్ ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడ ఓ రైలు ప్రయాణానికి సిద్దంగా వుంది. అయినా ఫర్వాలేదులే.. రోజు వుండేదేగా.. దాని ముందు నుంచి వెళ్దాం.. అనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా.. మెట్రో రైలు పట్టాలను దాటుకుంటూ సరిగ్గా రైలు ముందుకు వెళ్లాడు. ఇక తీరా రైలు ఫ్లాట్ ఫారం ఎక్కే సమయంలో రైలు కాస్తా ముందుకు కదిలింది. యువకుడిని కూడా ఢీకొన్నింది. అదే సమయంలో వ్యక్తి వున్న విషయాన్ని గుర్తించిన మెట్రో రైలు పైలెట్.. సడన్ బ్రేక్ వేయడంతో.. యువకుడు బతికి బయటపడ్డాడు.
ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలోని శాస్త్రీనగర్ మెట్రో రైల్వే స్టేషన్లో జరిగింది. మయూర్ పటేల్ అనే 21 ఏళ్ల యువకుడు.. రైల్వే ట్రాక్ దాటకూడదన్న నిబంధనలను మర్చి.. తేలిగ్గా అవతలి వైపు చేరుకునేందుకు చేసిన ఈ చర్యతో రైల్వే అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చదువుకున్న వారే ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని.. కాసింత అలస్యమైతే ఏం జరిగేదన్న పరిణామాలను కూడా అలోచించాలని క్లాస్ తీసుకున్న అధికారులు.. యువకుడు తనది తప్పేనని అంగీకరించిన తరువాత.. అతనికి జరిమానా విధించి వదిలిపెట్టారు.
#CCTV Delhi: Narrow escape for 21 year old Mayur Patel as train moved while he was crossing the track at Shastri Nagar metro station. He was later fined by authorities. During questioning he claimed that he did not know how to get to the other platform so he crossed the track pic.twitter.com/YbXcXPzYyA
— ANI (@ANI) May 23, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more