రాష్ట్రంలో తృతీయ ప్రత్యమ్నాయ పార్టీగా అవిర్భవించిన జనసేన.. 2019లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణలో తాము బరిలో నిలుస్తామని జనసేన స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలుపుతున్నట్లు ఆ పార్టీ అధినేత జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెల్లడించారు. కాగా తెలంగాణ రాష్ట్రంలోనూ పోటీ చేస్తామని చెప్పిన పవన్.. తెలంగాణలో తమ విధానం ఎలా వుండబోతుందన్న విషయాన్ని ఆగస్టు మాసంలో ప్రకటిస్తానని చెప్పారు.
హైదరాబాదులో ఇవాళ జరిగిన 13 జిల్లాల ప్రతినిధుల సమావేశంలో పవన్ కల్యాణ్ ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. పక్కా ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళదామని పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. బూత్స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికబద్ధంగా అడుగులు వేద్దామని అన్నారు. అనుభవం లేదని ఎవరైనా అంటే దాన్ని తిప్పికొట్టాలన్నారు. పోటీ చేయలేకపోవచ్చు.. కానీ రెండు సంస్థాగత ఎన్నికల్లో పని చేసిన అనుభవం ఉందన్నారు. సగటు మనిషి.. అణగారిన వర్గాల గొంతుకగా జనసేన ఉండాలని కార్యకర్తలకు పవన్ సూచించారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ వ్యూహకర్తగా దేవ్ ను నియమించామని పవన్ పార్టీ మఖ్యకార్యకర్తలకు పరిచయం చేశారు. గత పదినెలలుగా పార్టీ కార్యక్రమాల రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని కార్యకర్తలకు తెలిపారు. గతంలో తను స్థాపించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు సంబంధించిన 1200 మంది కార్యకర్తలు దేవ్ టీమ్ కు సహకరిస్తారన్నారు. ఆగస్టు రెండో వారంలో తెలంగాణలో పోటీపై ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. ఈ సందర్భంగా దేవ్ మట్లాడుతూ.. జనసైన్యాన్ని బలోపేతం చేసే ధిశగా అందరం కలసి అడుగులు వేద్దామని అన్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో కలిసి పని చేసిన అనుభవం తనకు వుందని చెప్పుకోచ్చిన ఆయన.. ఈ రంగంలో దశాబ్ద కాలంగా ఉన్నానని చెప్పారు. గొప్ప దృక్పథం ఉన్న నాయకుడు పవన్ కల్యాణ్ అని చెప్పిన ఆయన ఎన్నికలప్పుడు వచ్చి ముఖం చూపించి వెళ్లిపోయేటటువంటి రాజకీయ నాయకుడు కాదని అన్నారు. పవన్ కు ప్రజా సమస్యల పట్ల, సామాజిక అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది.
జనసేన పార్టీకి బలమైన భావజాలాల్ని, సిద్ధాంతాల్ని రూపొందించారు. అందుకు పటిష్టమైన వ్యూహాన్ని జోడిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తాం. ఇందుకు బూత్స్థాయి నుంచి పకడ్బందీగా ప్రణాళికలు వేసుకోవాలి. నా టీమ్కు మీ అందరి సహకారం అవసరం. రాజకీయంగా పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ పవన్ కల్యాణ్ ఆలోచనలను, సిద్ధాంతాల్నీ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలతో పాటు ఎన్నికల వరకు అనుసరించాల్సిన వ్యూహాల్నీ మీతో ఎప్పటికప్పుడు పంచుకుంటాను. ప్రజలతో మమేకమయ్యే పార్టీ జనసేన.. ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పని చేద్దాం" అని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more