constable extra marital affair caught redhanded by wife అక్రమ సంబంధం: కానిస్టేబుల్ ను ఉతికిరాసిన భార్య.!

Constable extra marital affair caught redhanded by wife

maritial affair, illegal affair, police conistable, mamata, ramesh, mahaboobabad, siddipet, madhoor police station, telangana, police, crime,

In yet another incident of extra marital affair, a police constable working as writer in madhoor policestation caught red handed by wife and his parents, filed complaint

అక్రమ సంబంధం: కానిస్టేబుల్ ను ఉతికిరాసిన భార్య.!

Posted: 04/27/2018 10:41 AM IST
Constable extra marital affair caught redhanded by wife

పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పోలీసు బాసులే తప్పుచేస్తూ దొరికిపోతే.. తాము మాత్రం నిజాయితీగా ఎందుకు వుండాలి అనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న సతిని కాదని పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఓ కానిస్టేబుల్. వక్రమార్గంలో నడుస్తున్నవారిని సన్మార్గంలో నడింపిచేలా చేయాల్సిన చట్టానికి ప్రతినిధిగా వుంటూ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం సమంజసం కాదని తెలిసినా అదే తప్పుకు పాల్పడ్డాడు.

ఇంకేముందు భర్త వివాహేతర సంబంధం గురించి అనోటా, ఈ నోటా తెలుసుకున్న భార్య, తన తల్లిదండ్రులు, ఇద్దరు కుమార్తెలతో వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అతనిని ఉతికి ఆరేసింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మరో మహిళతో ఎలా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నావని నిలదీసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా బావుజీగూడెంకు చెందిన రమేష్, మమత అనే యువతిని ప్రేమించి 2006లో వివాహం చేసుకున్నాడు.

ఆపై 2011లో ఆయనకు కానిస్టేబుల్ ఉద్యోగం రాగా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా మద్దూరు పోలీసు స్టేషన్ లో రైటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. స్థానికంగా వుంటున్న ఓ మహిళతో అతనికి పరిచయం ఏర్పడింది. దీంతో అమెతో సన్నిహిత్యం పెరిగి క్రమంగా వివాహేతర సంబంధానికి కూడా దారితీసింది. ఈ క్రమంలో భార్యా బిడ్డలను నిర్లక్ష్యం చేసిన రమేష్, చేర్యాలలో అమెతోనే గడపడం ప్రారంభించాడు. ఇంటికి వెళ్లడం పూర్తిగా మానేశాడు.

దీంతో భార్యకు అనుమానం కలిగింది. అసలు విషయాన్ని ఆరా తీసిన మమత, చేర్యాలకు వచ్చి ఇద్దరూ కలిసున్న వేళ వారి బాగోతాన్ని బయటపెట్టింది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నావని ఆరోపిస్తూ, సదరు యువతిని, రమేష్ నూ చెప్పుతో వాయించింది. ఇరుగుపొరుగు వారి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఆక్కడికి వచ్చి అందరినీ స్టేషన్ కు తరలించారు. మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles