తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ న్యూఢిల్లీ పర్యటన అర్థాంతరంగా ముగిసింది. అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో నాలుగు రోజుల క్రితం భేటీ అయిన సంరద్భంలో అక్కడ చర్చించిన అంశాలను ఢిల్లీలోని పెద్దలకు నివేదించే క్రమంలో హస్తిన నుంచి వచ్చిన అకస్మిక పిలుపు మేరకు ఢిల్లీకి నిన్న మధ్యాహ్నం పయనమైన గవర్నర్.. తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని తిరుగు పయనమయ్యారు.
ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీవ్ జైన్ తో కలసి చంద్రబాబుతో పలు అంశాలపై చర్చించిన క్రమంలో వాటి వివరాలను నివేదిక రూపంలో కేంద్రానికి సమర్పించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే తన పర్యటనను మధ్యలోనే ముగించుకుని ఈ ఉదయం హైదరాబాద్ బయలుదేరారు గవర్నర్.
ఇలా ఆయన పర్యటన మధ్యలోనే ముగియడం, ప్రధానితో భేటీ కాకపోవడం, నేడు షెడ్యూల్ లో ఉన్న హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ తో చర్చలు సాగకపోవడం కొత్త చర్చను తెరపైకి తెచ్చింది. కాగా, ఇటీవలి కాలంలో గవర్నర్ తటస్థంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తుండటం, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్టుగా గవర్నర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేసిన నేపథ్యంలో నరసింహన్ తన పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణం కావడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more