ఓ వైపు తాను ప్రధాని కావడాన్ని జీర్ణంచుకోలేక విపక్షాలు హింసను ప్రోత్సహిస్తున్నాయని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ఓ వైపు అరోపించి.. ఇందుకు నిరసనగా ఈ నెల 12న బీజేపి ఎంపీలంతా ఒక్కరోజు నిరాహర దీక్షకు పూనుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక ఇదే తరుణంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా కూడా విపక్షాలను కుక్కలు, పిల్లులు, ముంగీసలు, పాములు అంటూ మండిపడ్డారు. దీంతో బీఎస్సీ అధినేత్రి మాయావతి కూడా అదే స్థాయిలో షాకు కౌంటర్ ఇచ్చారు.
బీజేపీకి వ్యతిరేకంగా జట్టుకట్టిన ప్రతిపక్షాలను జంతువులతో పోల్చడంపై అగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా మీతో జతకట్టిన టీడీపీ సహా పలు మిత్రపక్షాలు మీకు దూరం కావడంతో బీజేపీ ఏకాకిలా మారి అవాక్కులు చెవాక్కులు పేలుస్తున్నారని ఎద్దేవా చేశారు. లోక్సభ ఉపఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పడంతో ఆ పార్టీ నేతలకు దిక్కుతోచడం లేదు. దీని కారణంగానే ‘‘అవమానకర’’ భాషతో దూషణకు దిగుతున్నారని అమె మండిపడ్డారు.
ఉపఎన్నికలకు ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రతిపక్షాలపై నోరుపారేసుకుని భారీ మూల్యం చెల్లించుకున్నారని మాయావతి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ‘‘శిష్యుడు’’ అమిత్ షా నాయకత్వంలో ఆ పార్టీ విలువలు ఎంత దిగజారాయో తాజా వ్యాఖ్యలు రుజువుచేస్తున్నాయని బీఎస్పీ అధినేత తన లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పతిపక్షాలను ఎంత గౌరవించాలన్న విషయం కూడా తెలియకుండా బీజేపి పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు.
‘‘బీజేపీ చెప్పిన నవ భారతం ఇలాగే ఉంటుందా? అసహ్యమైన మాటలు, చులకన చేసే వ్యాఖ్యలతో దేశాన్ని నిర్మిస్తారా? భారత అధికార పార్టీకి ఇది తగునా?’’ అని మాయవతి సూటిగా ప్రశ్నించారు. అతివిశ్వాసం, అహంకారం కారణంగా ఆ పార్టీకి మిత్రపక్షాలన్నీ దూరమయ్యాయనీ... దీంతో ఇప్పుడు బీజేపీ ఏకాకిగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చకపోవడం వల్ల... ఎప్పటినుంచో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సైతం బీజేపీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టిందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more