బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ను రాజస్థాన్ లోని జోధ్ పూర్ కోర్టు దోషిగా తేల్చింది. దాదాపు 20 ఏళ్ల క్రితానికి సంబంధించిన కృష్ణ జింకల వేట కేసులో.. వన్యప్రాణుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 9, 51ల మేరకు న్యాయస్థానం సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్థారించింది. కాగా ఈ కేసులో మరికొద్దిసేపట్లో ఆయనకు ఏ శిక్షను విధిస్తారన్నది న్యాయస్థానం తీర్పులో వెలువరించింది. ఈ కేసులో సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చిన న్యాయస్థానం.. ఆయనతో పాటు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న ఇతర నటీనటులు సైఫ్ అలీఖాన్, సోనాలి బింద్రే, టబు, నీలమ్ కొఠారీలను నిర్ధోషులుగా ప్రకటించింది.
1998కృష్ణ జింకలను వేటాడిన కేసులో మార్చి 28నాటికి తుదివాదనలు పూర్తయ్యాయి. అయితే చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దేవ్కుమార్ కత్రి తీర్పును వాయిదా వేశారు. ఈరోజు కేసు విచారణకు రాగా సల్మాన్ఖాన్ను కోర్టు దోషిగా తేల్చింది. 1998లొ హమ్ సాథ్ సాథ్ హై అన్న చిత్రం నిర్మాణం సందర్భంగా జోధ్పూర్ అటవీ ప్రాంతానికి వచ్చిన వీరు.. అడవిలోకి అనుమతి లేకుండా ప్రవేశించి.. స్థానికంగా వున్న కంకని గ్రామంలో కృష్ణ జింకలను వేటాడినట్లుగా అరోపణలు వచ్చాయి. దీనిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. సుమారు 20 ఏళ్ల విచారణ అనంతరం ఈ కేసులో సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చింది న్యాయస్థానం.
అయితే న్యాయనిపుణులు మాత్రం ఇప్పటికే సల్మాన్ ఖాన్ వన్యప్రాణ చట్టంలోని సెక్షన్ 51 ప్రకారం ఏడాది నుంచి ఆరేళ్ల వరకు శిక్ష పడే అవకాశముందని చెబుతున్నారు. అయితే సల్మాన్ ఖాన్ కోసం జోద్పూర్ అధికారులు జైలు గదిని కూడా శుభ్రం చేసి రెడీగా వుంచారు. అయితే ఆయన గదిలో ఏలాంటి ప్రత్యేక వసతులు, సదుపాయాలు కల్పించలేదని కూడా చెబుతున్నారు. అయితే ఇదే జైలులో వున్న రాజస్థాన్ గ్యాంగ్ స్టర్ సల్మాన్ ను చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో అతనికి ప్రత్యేక భద్రతను కల్పిస్తామని జైలు అధికారులు చెప్పారు.
సల్మాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష:
కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. దాదాపు ఇరవై ఏళ్ల తరువాత ఈ కేసులో తీర్పును వెలువరించిన జోధ్ పూర్ న్యాయస్థానం.. సల్మాన్ దోషిగా నిర్థారించిన అనంతరం ఆయనను దోషిగా నిర్థారించి ఐదేళ్ల కారగార శిక్షను విధించింది. సల్మాన్ కు శిక్ష ఖరారుకాగానే, ఆయన్ను జోధ్ పూర్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసిన పోలీసులు, కోర్టు ఆవరణలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో ఆయన్ను జైలుకు తరలించనున్నారు.
మూడేళ్లకు పైగా శిక్ష పడిన నేపథ్యంలో ఆయనకు వెనువెంటనే బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసే అవకాశం వున్నా.. ఆయన కోర్టు తీర్పును అనసరించి తప్పకుండా జైలుకు తరలించాల్సిన అవసరం వుంది. ఆయితే సల్మాన్ చేస్తున్న సామాజిక చర్యలను కూడా దృష్టిపెట్టుకుని అయనకు రెండేళ్ల శిక్ష వేయాలన్న ఆయన తరపు న్యాయవాదుల వాదనలను తిరస్కరించిన న్యాయస్థానం ఆయనకు ఐదేళ్ల శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఇక ఈ కేసులో మిగతా నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడంపై బిష్ణోయి సభ వెంటనే తమ రాష్ట్ర హైకోర్టులో అపీలు చేయాలని నిర్ణయించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more