అది ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత వున్న పర్యాటక ప్రాంతం. నిత్యమూ వేలాది మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రముఖ వ్యాపార సంస్థగా పేరొందిన యజమానులు ఈజీ మని కోసం ఓ చేసిన అత్యంత పాడుపని వెలుగులోకి వచ్చింది. ఇటు హోటల్ రంగంలో పాటు అటు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో కూడా తన ఉనికి చాటుకుంటున్న తపస్య.. అటు తమ అధీనంలోని ఓ భవనాన్ని బాలీవుడ్ షూటింగులకు, టీవీ సీరియల్ షూటింగ్ లకు కూడా అద్దెకిస్తూ బాగానే రాణిస్తున్నారు. అయినా డబ్బు మీద యావ సరిపోకపోవడంతో.. ఈజీగా డబ్బును సంపాదించుకునేందుకు చేయకూడని పనులు చేసి.. అడ్డంగా బుక్కయ్యారు.
స్థానికంగా బడా వ్యాపార వేత్తగా చెలామణి అవుతూనే వారు తమ పేరు మాటున చేయకూడని పని చేశారు. తమ అధీనంలో నడుస్తున్న హోటళ్లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అగ్రాలోని పోలిస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోని ప్రతీక్ష ఎన్ క్లేవ్ లోని తపస్యా హోటల్ లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్క సమాచారం అందడంతో అకస్మికంగా దాడి చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. కాగా, తమ వ్యాపారం నిరాటంకంగా నిర్వహించడానికి ఢిల్లీలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినులను ఈజీ మని ప్రలోభానికి గురి చేశారని తెలిసింది.
ఆగ్రా ఏఎస్పీ రవీనా త్యాగి వెల్లడించిన వివరాల ప్రకారం, తమకు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారంతో తపస్య హోటల్ పై అకస్మిక దాడి చేయగా, ఇద్దరు వ్యభిచారిణులతో పాటు ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నామన్నారు. హోటల్ యజమానురాలు ప్రియాంకా రావత్, అమె కుమారుడు సిద్ధార్థ రావత్ లను అదుపులోకి తీసుకున్నామని, అయితే అమె కూతురు శైలజా అలియాస్ శాజు రావత్ పరారీలో వున్నారని తెలిపారు. కాగా వ్యభిచారులను విచారించిన పోలీసులకు ఈ క్రమంలో మరిన్ని విస్మయం చెందే నిజాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు.
వారానికి రూ. 20 వేలు నుంచి 25 వేల రూపాయల వరకు ఇస్తామని నమ్మబలికి.. తమ వద్దకు వచ్చే కస్టమర్లను వారు సంతోషపరిస్తే చాలునని, అయితే ఈ విషయాలు ఎప్పటికీ వెలుగులోకి రావని కూడా వారు విద్యార్థినులకు హామీ ఇచ్చి.. కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నారని తెలిసిందని రవీనా త్యాగి తెలిపారు. ప్రియాంక రావత్ భర్త చనిపోయిన తరువాత వ్యాపార బాధ్యతలను నిర్వహిస్తున్న ప్రియాంకా రావత్.. తన కొడుకు, కూతురి సాయంతో కలసి హోటళ్లో గుట్టుగా వ్యభిచారం నిర్వహించారని తెలిపారు. ఢిల్లీ నుంచి విద్యార్థినులను తీసుకువచ్చి.. వారితో వ్యభిచారం చేయిస్తుందని తెలిపారు. హోటల్ గదుల్లోని డస్క్ బిన్ల నుంచి కండోమ్ లు, రిసెప్షన్ డెస్క్ నుంచి కండోమ్ కార్టన్ లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, వ్యభిచార గృహం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని రవీనా త్యాగి వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more