మైనర్ బాలికలను పెళ్లాడిన నేపథ్యంలో వారిపై బలవంతంగా, వారి విముఖతను లెక్కచేయకుండా జరిగే బలవంతపు శృంగారాలను అత్యాచారాలుగా భావించాలా..? వద్ద అన్న విషయంలో వాటిని కూడా నేరాలుగానే భావించాలని ఓసారి, భావించలేమని మరోసారి కేంద్రం డోలాయమానంలో వున్నప్పటికీ.. న్యాయస్థానం మాత్రం నేరంగానే పరిగణిస్తామని ఇటీవలే స్పష్టం చేసింది. అంతే న్యాయస్థానం తీర్పును తెలుసుకున్న క్రమంలో ఓ భార్య తన భర్త తనను మైనారిటీ తీరకుండానే వివాహం చేసుకున్నాడని, తనపై బలవంతంగా అఘాయిత్యానికి కూడా పాల్పడ్డాడని ఏకంగా పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ఫూణేలో చోటుచేసుకుంది.
పూణే నగరానికి చెందిన సూరజ్ రంగ కులాతున్ అనే యువకుడు తనను బలవంతంగా పెళ్లి చేసుకొని అత్యాచారం జరిపాడని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు 17 ఏళ్ల వయసుండగా... 18 ఏళ్లని తప్పుడు ధ్రువీకరణ పత్రం తీసుకొని తన భర్త మోసం చేశాడని ఆరోపించింది. భర్తతోపాటు అతని తండ్రి కూడా తనను లైంగికంగా వేధించాడని, తన పిర్యాదులో పేర్కొంది. తాను కాకుండా తన భర్తకు అంతుకుముందే మరో మహిళతో కూడా వివాహం జరిగిందని.. కాగా తనపై అత్తింటి అరళ్లు కూడా అధికమయ్యాయని, అత్త, మామలు, అడపడచులు తనను మానసికంగా వేధిస్తున్నారని మైనర్ బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ప్రస్తుతం ఇరవై ఏళ్లకు చేరుకున్న సదరు బాధితురాలు తన భర్త తనపై అఘాయిత్యానికి పాల్పడటంతో పాటు తన కుటుంబసభ్యులను అంతం చేస్తానని కూడా బెదిరింపులకు పాల్పడ్డాడని, తనతో పాటు తన కుటుంబసభ్యలకు కూడా ఈ హెచ్చరికలు జారీ చేయడంతో తాము నిమ్మకుండిపోయామని పిర్యాదులో పేర్కోంది. కాగా బాధిత మహిళ ఎస్టీ వర్గానికి చెందిన కావడంతో.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుగా కూడా పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. దీంతో బాధితురాలి భర్త, అత్తా, మామలను కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more