​​Groom killed, bride injured in Telangana road accident వరుడ్ని బలితీసుకున్న ప్రమాదం.. పసుపు పారాణి అరక ముందే..

Groom among 5 of telangana wedding party killed as car rams tree bride hurt

Telangana Accident, Telangana Wedding, Khammam Accident, Tadepalligudem, West Godavari, Warangal, Telangana, Andhra Pradesh, crime, Khamma road accident, wedding party

Five people including a groom were killed and three others seriously injured today when the vehicle they were travelling in hit a tree in Telangana's Khammam district, police said. The accident took place when the wedding party was on their way to the groom's home in Warangal district from the bride's home in Tadepalligudem, Andhra Pradesh.

ఖమ్మంలో ఘోరం.. పెళ్లింట విషాదం.. పసుపు పారాణి ఆరక ముందే..

Posted: 03/09/2018 10:29 AM IST
Groom among 5 of telangana wedding party killed as car rams tree bride hurt

ఖమ్మం జిల్లాలో ఘోరం విషాదం అలుముకుంది. వధువు నివాసంలో పెళ్లి చేసుకుని ఎన్నో కొంగ్రోత్త అశలతో.. భవిష్యత్తుపై బారేడేసి నమ్మకంతో తన నివాసానికని బయలుదేరిన ఆ నవ వరుడ్ని రోడ్డు ప్రమాదం కబళించింది. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు డ్రైవర్.. మార్గమధ్యంలో నిద్రలోకి జారుకుని వాహనంపై నియంత్రణను కోల్పోవడంతో కారు కాస్తా రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొనింది. దీంతో బంగారు భవిష్యత్తుపై కలలు కంటూ వస్తున్న వరుడ్ని కాస్తా విధి వక్రీంచి తిరిగిరానీ లోకాలకు తరలించింది.

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడులో ఈ తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వరుడితో పాటు ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనాస్థలంలోనే అసువులు బాసారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. కాగా వధువు కూడా తీవ్ర గాయాలపాలైంది. అమె కూడా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుందని వైద్యులు తెలిపారు. కాగా 24 గంటల గడిస్తే కానీ అమె పరిస్థితి గురించి చెప్పలేమంటున్నారు. అయితే అమె కాళ్లకు వేసిన పసుపు పారణి అరకముందే అమెకు వైదవ్యాన్ని విధి ప్రసాదించడంతో స్థానికంగా విషాదావాతావరణం అలుముకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఆంద్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిన్న(మార్చి8) రాత్రి పెళ్లిచేసుకొన్న ఓ జంట.. వరుడి స్వగ్రామం వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు ఇన్నోవా కారులో బయలుదేరారు. నవవధూవరులతో పాటు మొత్తంగా ఎనమిది మంది ఈ కారులో ప్రయాణిస్తున్నారు. కాగా మార్గమధ్యంలో ఇవాళ తెల్లవారుజామున ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం పల్లిపాడు వద్దకు చేరుకోగానే కారు నడుపుతున్న డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో అతడికి కారుపై నియంత్రణ కోల్పోవడంతో.. అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనున్న చెట్టను బలంగా ఢీకొనడంతో ప్రమాధం సంబవించింది. క్షతగాత్రులను చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles