ప్రేమ పేరుతో యువతి గొంతు కోసిన యువకుడు.. ఆమెను హతమార్చిన మరుసటి రోజే మరో యువతి మెళ్లో తాళికట్టాడు. ఆ మర్నాడే పోలీసులకు పట్టుబడటంతో ఒక్కసారిగా గ్రామంలో కలకలం రేగింది. యాదాద్రి జిల్లాలో మోత్కూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన బొడ్డుపల్లి లక్ష్మయ్య కుమార్తె భార్గవి (23) డిగ్రీ వరకు చదివి, ఆత్మకూర్ మండల కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో పని చేస్తోంది. బుజిలాపురం గ్రామానికి చెందిన నరేందర్ (28) అలియాస్ నరేష్ అదే ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. నాలుగేళ్లుగా వీళ్ల వ్యవహారం కొనసాగుతుండగా.. చివరకు పెళ్లి చేసుకుంటానని ఆమెను లోబర్చుకున్నాడు. అయితే కులాలు వేరంటూ చివరకు ఆమెను మోసం చేశాడు.
ఇంతలో నరేందర్, మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడు. ఇది తెలిసిన భార్గవి అతనిని నిలదీసింది. దీంతో పన్నాగం పన్నిన నరేందర్.. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుందామని ఆమెను నమ్మించాడు. శనివారం బుజిలాపురం సమీపంలోని తమ వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. మాటల్లో పెట్టి, వెనుకనుంచి రాయితో ఆమె తలపై మోది హతమార్చాడు. అనంతరం అదే బావి వద్ద ఆమెను పూడ్చి పెట్టి ఏమీ తెలియనట్టు ఇంటికెళ్లిపోయాడు. మరుసటి రోజు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు.
వెలుగులోకి వచ్చిందిలా...
ఇంతలో భార్గవి కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నరేందర్ తో ప్రేమ వ్యవహారం వారికి తెలిసి ఉండటంతో అతనిపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పెళ్లయిన మరుసటి రోజు పోలీసులు నరేందర్ ను విచారించగా, తన పెళ్లికి అడ్డుగా ఉండడంతోనే భార్గవిని హత్య చేసినట్టు అంగీకరించాడు. మృతదేహాన్ని మృతదేహాన్ని బయటకు తీయించిన పోలీసులు, నరేందర్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపారు. నరేందర్ కు నాలుగేళ్ల క్రితమే వివాహం కాగా.. 15 రోజులకే విడాకులు తీసుకున్నాడు. తాజాగా బందువుల అమ్మాయితో మరో వివాహం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more