భారతీయ రైల్వేల్లో ప్రయాణించే ప్రయాణికులు ఇది శుభవార్త. మరీ ముఖ్యంగా అప్పటికప్పుడు అనుకుని తత్కాల్ లో టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణించే వారికి ఇది మరింత అనందాన్ని తెచ్చిపెడుతుంది. ఇటీవల లోకల్ సర్కిల్స్ అనే ఓ సంస్థ రైల్వేశాఖ తత్కాల్ టిక్కెట్లపై నిర్వహించిన ఓ సర్వేలో సుమారుగా 94శాతం మంది తత్కాల్ లో బుక్ చేసుకున్న టికెట్లను అరు గంటల ముందు రద్దు చేసుకున్న క్రమంలో తమ డబ్బులో సుమారు 50 శాతం మేరైనా వెనక్కి తిరిగివ్వాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అయితే ఆ మేర ప్రజాభిప్రాయంపై నిర్ణయాన్ని తీసుకున్న రైల్వేశాఖ.. ఇక పనిలో పనిగా తత్కాల్ టికెట్లపై ఇక నూటికి నూరు శాతం డబ్బును కూడా వెనక్కిచ్చే అంశాన్ని కూడా తెరతీసింది. అయితే ఇలా నూటికి నూరు శాతం టికెట్ల డబ్బు వాపస్ రావాలంటే ప్రయాణికులకు కొన్న షరతులు వర్తించనున్నాయి, కొన్ని షరతులకు లోబడి తత్కాల్ టికెట్లపైనా పూర్తి రిఫండ్ ఇస్తామని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ-టికెట్లతో పాటు కౌంటర్ లో తీసుకున్న టికెట్లపైనా ఇది వర్తిస్తుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
ఇక రైల్వేశాఖ తెలిపిన షరతులను ఏంటంటి..
* టికెట్ తీసుకున్న స్టేషన్ కు రైలు మూడు గంటలు అంతకుమించి ఆలస్యమైతే పూర్తి రిఫండ్ లభిస్తుందని తెలిపింది.
* ఆ స్టేషన్ కు రాకుండా రైలును మరో దారిలో మళ్లించినప్పుడు తత్కాల్ టికెట్ పై పూర్తి రిఫండ్ లభిస్తుంది.
* ప్రయాణికులు ఎక్కాల్సిన కోచ్ ను అధికారులు అనుసంధానించకున్నా కూడా రిఫండ్ లభిస్తుంది.
* ఏసీ క్లాసులో రిజర్వేషన్ చేయించుకుని, లోయర్ క్లాసులో టికెట్ కన్ఫర్మ్ అయి, ప్రయాణించడం ఇష్టం లేకున్నా కూడా పూర్తి రిఫండ్ లభిస్తుంది.
* ఒకవేళ లోయర్ క్లాసులో ప్రయాణించేందుకు అంగీకరించిన ప్రయాణికుడికి ఆ వ్యత్యాసాన్ని రైల్వే శాఖ వెనక్కు తిరిగి ఇచ్చేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more