దేశీయ రెండవ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజ సంస్థగా పేరొందిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో.. ముంబైలోని ఆ బ్యాంకుకు చెందిన పలు శాఖలలో సీబిఐ, ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ముంబై బ్రాంచ్ లో సుమారు రూ.11,300 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు స్వయంగా అదే బ్యాంకు యాజమాన్యం అంగీకరిస్తూ.. బాంబే స్టాక్ ఎక్సేంజ్ కు సమాచారం అందించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తమ బ్యాంకులో మోసపూరిత, అనధికారిక లావాదేవీలు కొందరు ఖాతాదారుల ప్రయోజనాల కోణంలో జరిగినట్టు గుర్తించామని పేర్కొంది.
ఈ లావాదేవీల ఆధారంగా ఆయా ఖాతాదారులకు విదేశాల్లో రుణాలు జారీ అయినట్టు వివరించింది. దీనిపై దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకునేందుకు వీలుగా దర్యాప్తు ఏజెన్సీలకు నివేదించామని, స్వచ్ఛమైన, పారదర్శక బ్యాంకింగ్ సేవలకు కట్టుబడి ఉన్నామని పంజాబ్ నేషనల్ బ్యాంకు యాజమాన్యం తెలిపింది. అయితే ఈ కుంభకోణంలో గీతాంజలి జెమ్స్ సంస్థకు సంబంధమున్నట్లు వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ సంస్థను నడుపుతున్న బిలియనీర్, నిరవ్ మోడీ.. గీతాంజలి జెమ్స్ సహా, గిల్లి ఇండియా, నక్షత్రా పేర్లతో కూడా బ్యాంకు నుంచి రుణాలను తీసుకుని వాటిని గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు దారిమళ్లించాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
రుణాలను జారీ చేయడంలో దేశంలోనే నాలుగోస్థానంలో వున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు.. సత్యం రామలింగరాజుకు చెందిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం తరువాత గీతాంజలి జెమ్స్ సంస్థ చేసిన ఈ కుంభకోణమే పెద్దది. సత్యం రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ పేరు రూ.9 వేల కోట్ల కుంభకోణం జరపిన విషయం పాఠకులకు తెలిసిందే.
ఆర్థిక శాఖ కీలక అదేశాలు:
పీఎన్బీ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా దేశంలోని అన్ని బ్యాంకులు వెంటనే స్టేటస్ రిపోర్టును అందించాలని ఆదేశించింది. పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలు తప్పించుకోవడానికి వీలులేదని, ఇదే సమయంలో నిజాయితీ రుణగ్రహీత వేధించబడవద్దని ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని బ్యాంకులకు సీరియస్ ఆదేశాలు జారీచేసింది. వెంటనే స్టేటస్ రిపోర్టును తమకు అందించాలని తెలిపింది. ముంబై శాఖలో ఈ మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు పేర్కొన్న పీఎన్బీ.. నిరవ్ మోదీపై పేరును కూడా తెరపైకి తీసుకురావడంతో.. అయనను సీబిఐ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more