గత సార్వత్రిక ఎన్నికలలో భారత్ అర్మీ ఛాతి 56 అంగుళాలని ప్రధాని నరేంద్రమోడీ కీర్తించిన విషయాన్ని మర్చిపోయారో లేక తన సంఘ గురించి చర్చనీయాంశం కావాలనో, లేక స్థానిక యువత తమ వైపు అకర్షితులు కావాలనో కానీ గత కొన్నేళ్ల కిత్రం మారణహోమానికి దారితీసిన ప్రాంతంలో అర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మత ఘర్షణలతో గత కొన్నేళ్ల క్రితం రగిలిన ముజాఫర్ పూర్ లోని ఓ పాఠశాల అవరణలో మోహన్ భగవత్ తీవ్ర వ్యాఖ్యలను విపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దేశానికి ప్రాధాన్యత లేని సైన్యం ఎవరి కోసం..? ఎందుకోసం అంటూ నెట్ జనులు ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భగవత్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. భారతదేశ ఆర్మీపై భగవత్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందిచిన ఆయన తక్షణం భారత దేశ అర్మీకి క్షమాఫణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భగవత్ వ్యాఖ్యలు సిగ్గు పడాలే వున్నాయని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రసంగం ప్రతీ భారతీయుడ్ని అవమానించిందని దుయ్యబట్టారు. భరత జాతి కోసం ప్రాణాలు అర్పించిన స్వతంత్ర్య సమరయోధులను కించపర్చేలా భగవత్ ఎలా ప్రసంగిస్తారని ప్రశ్నించారు.
ప్రతీ జవాను వందనాన్ని అందుకునే భారత జాతీయ పతాకానికి భగవత్ వ్యాఖ్యలు అవమానకరమని, భారత పతాకా ఔనత్యాన్ని మసకబారేలా భగవత్ వ్యాఖ్యలు ఉన్నాయని రాహుల్ గాంధీ అవేదన వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం సరిహద్దులో యముకలు కొరికే చలిలో విధులు నిర్వహిస్తున్న సైన్యాన్ని మోహన్ భగవత్ కించపర్చారని మండిపడ్డారు. దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరజవాన్లు త్యాగాలను అవమానపర్చారని అగ్రహం వ్యక్తం చేశారు. సమయం, సందర్భం వస్తే దేశం కోసం పోరాడేందుకు ఆర్మీని మూడు రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ సిద్ధం చేయగలదని.. అదే అర్మీ అయితే ఆరు నుంచి ఏడు నెలలు తీసుకుంటుందని మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more