New CS of Telangana Shailendra Kumar Joshi | రెండేళ్ల స‌ర్వీస్.. అయినా ఆయన వైపే కేసీఆర్ మొగ్గు

Telangana new cs appointed

Telangana, Chief Secretary, Shailendra Kumar Joshi IAS, CS SK Joshi, Telangana New CS, Shailendra Kumar Joshi KCR

Telangana govt appoints senior IAS officer Shailendra Kumar Joshi as chief secretary.

తెలంగాణ కొత్త సీఎస్ గా ఎస్ కే జోషి

Posted: 01/31/2018 03:43 PM IST
Telangana new cs appointed

తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రధాన కార్యదర్శిని నియమించింది. సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి శైలేంద్ర కుమార్‌ జోషిని సీఎస్ గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుత సీఎస్‌ ఎస్పీ సింగ్‌ పదవీకాలం బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో నూతన సీఎస్‌గా జోషిని నియమిస్తన్నట్లు టీ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. రేసులో చాలా మంది ఉన్న‌ప్ప‌టికీ.. సుమారు రెండేళ్ల స‌ర్వీసు మాత్రమే ఉన్న జోషి వైపే ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొగ్గు చూపటం విశేషం.

శైలేంద్ర కుమార్ జోషి...

డిసెంబ‌ర్ 20, 1959లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌రేలీలో ఆయ‌న జ‌న్మించారు. 1984లో ఆయ‌న ఐఏఎస్‌గా జాయిన్ అయ్యారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు జిల్లాలో అసిస్టెంట్ క‌లెక్ట‌ర్‌గా ఆయ‌న వృత్తి జీవితం ప్రారంభించారు. కేంద్ర పర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ‌లో తొమ్మిదేళ్ల పాటు ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో రియో డీ జెనిరోలో జ‌రిగిన యునైటెడ్ నేష‌న్స్ కాన్ఫ‌రెన్స్ ఆన్ ఇన్విరాన్‌మెంట్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో కూడా ఆయ‌న పాల్గొన్నారు.ప్ర‌స్తుతం ఇరిగేష‌న్ శాఖ‌లో ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శిగా శైలేంద్ర జోషి బాధ్య‌త‌లు వ‌హిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles