మరికొ్ద్ది క్షణాల్లో అక్కడ వున్న కోలాహాల వాతావరణం.. కన్నీళ్లు.. ఆనందబాష్పలకు నిలయంగా మారనున్న తరుణం. అమ్మాయిని కన్న తల్లిదండ్రుల ఆశలు, బాధ్యతలు తీరునున్న క్షణాలు అవిష్కృతం. కల్యాణమండపంలో బంధుమిత్రుల హడావుడి... కొత్త బంధుత్వాలు, అప్యాయతలకు పునాదులు పడుతున్న సమయంలో.. వరుడ్ని కూర్చోబెట్టి పెళ్లి తంతు కూడా మొదలు పెట్టేశారు.
వేదమంత్రోచ్చరణ మధ్య అమ్మాయిని తీసుకురండీ అంటూ అయ్యవారు చెప్పేశారు. దీంతో అమ్మాయి కోసం అమె తరపు వారు వెళ్లారు. ఎంతకీ రానీ వధువు గురించి వరుడి కూడా వేయికళ్లతో వేచిచూస్తున్నాడు. అంతలో నాటకీయ ఫక్కీలో వరుడితో తాళి కట్టించుకోవాల్సిన వధువు తన బాయ్ ఫ్రెండ్తో కలిసి పారిపోయిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చన్నకల్ మాలూర్ పట్టణంలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నగరానికి 46 కిలోమీటర్ల దూరంలోని పద్మావతి కల్యాణ మండపంలో వరుడు గురేష్ (23) వధువు సౌమ్యకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి సందడి ఆరంభమైంది. వరుడు గురేష్ ముస్తాబై వధువు రాక కోసం పెళ్లి మండపంలో ఎదురుచూస్తుండగా అంతలో వధువు తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయింది. అంతే వధూవరుల కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఎట్టకేలకు వధువుకు చెల్లెలు అయిన బాబాయ్ కూతురైన వెంకటరత్నమ్మ అనే మరో అమ్మాయితో గుర్రేష్ కు వివాహం చేయాలని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయించుకున్నారు.
వీరి వివాహానికి సంప్రదాయ బద్ధంగా పూజాదికాలు నిర్వహించారు. విందు కూడా జరిగింది. అంతలో ఈ సారి వరుడు వధువుకు షాకిచ్చి పారిపోయాడు. మొదటి వధువు చేసిన పనికి ప్రతీకారంగా రెండోసారి పెళ్లి ఏర్పాట్లు చేసి ఆపై వధువుకు చేయిచ్చి వరుడు తన ప్రియురాలి కోసం పారిపోయాడు. మొత్తం మీద పెళ్లి కాస్తా జరగక పోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు వెళ్లిపోవడంతో పెళ్లి వేడుక కాస్తా ఖాళీగా దర్శనమిచ్చింది. వధూవరులు పారిపోయిన ఘటనలు బెంగళూరులో చర్చనీయాంశంగా మారాయి. పెళ్లి చేసుకోవాల్సిన వధూవరులిద్దరూ పారిపోయి బంధుమిత్రులకు ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more