హర్యానా గాయని మమతా శర్మ అదృశ్యఘటన విషాదాంతమైంది. కొన్న రోజుల క్రితం అదృశ్యమైన ఈ గాయని ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సొంత జిల్లా రోహ్ తక్ లోని ఆయన స్వగ్రామం బనియానీకి సమీపంలో ఆయనకు చెందిన పోలాలకు కొంత దూరంలో మృతదేహమై కనిపించడం తీవ్ర కలకలాన్ని రేపింది. గడచిన ఆదివారం నాడు తన స్నేహితుడు మోహిత్ కుమార్ తో ఓ పాట కచేరిలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమె, ఆపై ఇంటికి రాలేదు. ఆమె మృతదేహం గ్రామ సమీపంలోని పొలాల్లో కనిపించింది.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేయగా, ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో మోహిత్ తో కలసి సోనిపట్ జిల్లాలోని గోహనా పట్టణంలో ప్రదర్శనకు ఆమె వెళ్లగా, ఆపై 10.30 గంటల సమయంలో మోహిత్, మమత కుటుంబీకులకు కాల్ చేసి, ఆమె మరి కొందరితో కలసి ఇంకో కారులో వెళ్లిందని చెప్పాడు. వారు తనకు తెలుసునని, ఈవెంట్ వద్ద కలుస్తానని ఆమె చెప్పిందని, కానీ ఆమె అక్కడికి రాలేదని సమాచారం ఇచ్చాడు.
వెంటనే ఆమె సెల్ ఫోన్ కు రింగ్ ఇస్తే, ఫోన్ రింగ్ అయినా ఎవరూ ఎత్తలేదు. ఆపై సోమవారం ఉదయానికి స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో అందోళనకు గురైన మమత కుటుంబ సభ్యులు ఈ విషయమై వెనువెంటనే పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే పోలీసుల వెంటనే స్పందించి చర్యలు తీసుకుని వుంటే మమత దారుణ హత్యకు గురైయ్యేది కాదని, కుటుంబసభ్యులు అరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం మమతతో కారులో వెళ్లిన వారెవరన్న విషయంలో విచారిస్తున్నామని.. ఈ క్రమంలో అమె విగతజీవిగా కనిపించిందని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more