సుప్రీంకోర్టు పరిపాలన సజావుగా లేకపోవడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి చేరిందంటూ బహిరంగంగా ప్రకటించిన నలుగురు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ తో భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా జస్టిస్ దీపక్ మిశ్రా ఇవాళ ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు.
తన తరువాతి వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో వున్న సీనియర్ న్యాయమూర్తులు ఇలా తిరిుగుబాటు ప్రకటనలు చేయడానికి కారణమైన అంశాలపై ఆయన వారితో చర్చించారు. న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాల పరిష్కారానికి ఈ భేటీలో ప్రాధన్యతనిచ్చినట్లు సమాచారం. ఉదయం కోర్టు వ్యవహారాలు ప్రారంభమయ్యే సమయం 10.30 గంటలకు ముందే ఈ భేటీ జరిగింది.
సుమారుగా 15 నిమిషాల పాటు సీజే దీపక్ మిశ్రా నలుగురు న్యాయమూర్తులతో చర్చించారు. కాగా, సమావేశం ఫలితాలు మాత్రం బయటకు వెల్లడి కాలేదు. స్వతంత్ర భారత దేశంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 12న జస్టిస్ జే చలమేశ్వర్ నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన న్యాయమూర్తులు న్యాయవ్యవస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అందోళన వ్యక్తం చేస్తూ దేశం, భరతజాతి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అసన్నమైందన్న సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more