ప్రతిపక్షంలోని నేతలు ఏ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై వెనువెంటనే చర్యలు తీసుకునే అధికారులు.. అదే అధికార పక్షంలోని సభ్యులు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా పట్టించుకోవడమే కాదు.. కనీసం వినిపించుకున్న పాపన కూడా పోవడంలేదు. సరిగ్గా ఎన్నికల సమయంలోనే ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాల వారిగా విభజనలు చేసి మరీ కామెంట్లు చేసినా అడిగే నాధుడే కరువయ్యాడు.
ఇప్పుడీ విషయం ఎందుకంటే.. తాజాగా రాజస్థాన్ మంత్రి జస్వంత్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అందరినీ అలోచింపజేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, ఉపాధి ఇలాంటి వాటిలో ప్రభుత్వంలోని వ్యక్తి ఎలా వ్యవహరిస్తున్నారన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఈ విషయాన్ని పక్కనబెడితే అమాత్యుల వారు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటో తెలుసా.? అయితే అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో కూడా తెలుసుకోవాలి.
రాజస్థాన్ లోని అల్వార్ లోక్ సభకు త్వరలోనే ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థిగా మంత్రి జస్వంత్ యాదవ్.. ఓటర్లు హిందువైతే తనకు, ముస్లింలు అయితే కాంగ్రెస్ కు ఓటు వేయాలన్నారు. అల్వార్ నియోజకవర్గంలోని దుఘేడా గ్రామంలో ప్రచారంలో పాల్గొంటూ మంత్రి జస్వంత్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
జస్వంత్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అటు హిందువులు, ఇటు ముస్లింలతో పాటు అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు వెల్లివిరుస్తున్నాయి. ఇక తమ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బిజేపీ అధిష్టానం.. ఇదంతా ప్రతిపక్షాల కుట్రగా పేర్కోంది. ఈ వీడియో కూడా కాంగ్రెస్ సృష్టేనని తిప్పికోట్టే ప్రయత్నాలు చేసింది. తమ అభ్యర్థి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వక్రీకరించారని ఆరోపిస్తుంది. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Mar 05 | వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కాస్తా రాష్ట్ర స్థాయికి చేరుకుంది. ఈ ఉద్యమంలో తాము కార్మికుల వైపే వున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ.. బంద్ కు మద్దతు తెలిపింది. అయితే ఇదే సంకేతాలను బలంగా... Read more
Mar 05 | హైదరాబాద్ నగరంతో పాటు అటు రాచకొండ, ఇటు సైబరాబాద్ కమీషనరేట్ ప్రాంతాల్లో రోజురోజుకీ ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. మెట్రో రైలు వచ్చి ట్రాపిక్ సమస్యను కొంతవరకు తీర్చినా.. నానాటికీ పెరుగుతున్న కార్లు, ద్విచక్ర వాహనాల... Read more
Mar 05 | కర్ణాటకకు చెందిన మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల వీడియో ఒకటి కర్ణాటకలో కలకలం రేపడంతో మంత్రి తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహరం అంతటితో చల్లబడిందనుకునే తరుణంలో... Read more
Mar 05 | విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి’ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ (మార్చి 5న) రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బంద్ కు అనుకూలంగానే... Read more
Mar 04 | మహిళలపై నేరాల విషయంలో గత ఏడాది అగ్రస్థానంలో నిలిచిన ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం చోటుచేసుకుంది. తన 17 సంవత్సరాల కుమార్తె తల నరికిన ఓ తండ్రి, ఆ తలను చేత్తో పట్టుకుని నడి... Read more