వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చేంటే ఏమిటీ అన్నట్లు.. రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా..? అన్న నానుడులను ఇప్పుడు గుర్తు చేసుకోక తప్పని పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. అధికారంలో వున్నామన్న ఒకింత ధైర్యం వారిలో మిండుగా వుండటం వల్లే ఇలా మాట్లాడుతారేమో తెలియదు కానీ.. ఏకంగా ఒక ఎమ్మెల్యే గవర్నర్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం మాత్రం నిజంగా రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేసింది. ఎక్కడో ఏదో రాష్ట్రంలోనో అనుకుంటే పోరబాటే ఏకంగా నవ్యాంధ్రలో బీజేపి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫైర్ అయ్యారు.
గవర్నర్ నరసింహన్ రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరించాలని, అయితే ఆయన తెలంగాణపై అధిక ప్రేమను కనబరుస్తూ.. ఇటు అంధ్రప్రదేశ్ పై మాత్రం సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లో ఉన్నందున తెలంగాణ పట్ల ప్రేమ చూపుతున్న గవర్నర్ నవ్యాంధ్రపై మాత్రం అదే ప్రేమను కనబర్చడం లేదని అన్నారు. తెలంగాణకు సంబంధించిన బిల్లి రోజుల వ్యవధిలో అమోదం తెలిపితే.. అదే తరహా బిల్లును అంధ్రప్రదేశ్ పంపితే నెల రోజులుగా పెండింగ్ లో నే పెట్టారని ఆయన అరోపించారు.
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే చట్టసవరణ బిల్లును నెలరోజులుగా గవర్నర్ ఆమోదించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఇదే తరహా బిల్లును మూడు రోజుల్లో గవర్నర్ ఆమోదించారని ఆయన అన్నారు. గవర్నర్ తీరు మారకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని విష్ణుకుమార్ రాజు అన్నారు. నాలా చట్టం లేకపోవడం వల్ల ఏపీకి పరిశ్రమలు రావడం లేదని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఏపీలో నాలా పన్ను 9 నుంచి 3 శాతానికి తగ్గాలని, ఏపీకి పెట్టుబడులు రావాలంటే నాలా చట్టం కీలకమని, గవర్నర్ వెంటనే బిల్లును ఆమోదించాలని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more