నూతన సంవత్సర అగమనోత్సవ వేడుకలకు సిద్దమవుతున్న యువతకు.. అందులోనూ మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భాగ్యనగరాన్ని రాజధానిగా చేసుకుని ఏలుతున్న తెలంగాణలో ఎలాంటి నిధులకు కొరత లేదని చెప్పిన ప్రభుత్వం.. ప్రతీ ఏడాది వేసవికి ముందు బీరు ధరలను, ఇక దసరా సమయంలో మద్యం ధరలనే పెంచే ప్రభుత్వం ఈ సారి తన పంథాను మార్చి ఏకంగా కొత్త సంవత్సర అగమనానికి ముందే ఈ మేరకు చర్యలు తీసుకుని మధ్యం ప్రియుల జేబులు కొల్లగొట్టేందుకు సిద్దమైంది.
మధ్యం ధరలను అమాంతం 5 నుంచి 12 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 12ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీగా మద్యం ధరలను పెంచుతూ కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరలను కనిష్ఠంగా 5 శాతం నుంచి గరిష్ఠంగా 12 శాతం వరకూ పెంచుతూ… పెరిగిన ధరల్లో పన్నులు మినహాయించి మిగిలిన మొత్తాన్ని డిస్టిలరీలకు అప్పగిస్తూ జీవో ఇచ్చింది. ఇక ధరలు అధికంగా పెరిగిన మద్యాన్ని పరిశీలిస్తే.. ఎక్కువ మంది తాగే సాధారణ మద్యానికే రెక్కలు అధికంగా వచ్చాయి.
కార్టన్ ధర రూ. 700 లోపు ఉన్న చౌక బ్రాండ్లపై 12 శాతం, ఆపై రూ. 1000 వరకూ కార్టన్ ధర ఉండే బ్రాండ్లపై 10 శాతం, ఆపై ధర ఉన్న బ్రాండ్లకు 5 శాతం చొప్పున ధర పెరుగుతుందని పేర్కొంది. అయితే పెరిగిన ధరలు లగ్జరీ బ్రాండ్లపై కాకుండా ఎక్కువమంది తాగే బ్రాండ్లపై ప్రభావాన్ని చూపుతోంది. ఇక తెలంగాణ ఏర్పాటయ్యాక మద్యం ధరల సవరణపై ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకే నిర్ణయాలు తీసుకున్నామని ఎక్సైజ్ శాఖ పేర్కొంది.
180 ఎంఎల్ క్వార్టర్ బాటిల్ ధరలు(అంచనా):
రాయల్ స్టాగ్ ధర రూ. 150 నుంచి రూ. 165
రాయల్ చాలెంజ్ ధర రూ. 210 నుంచి రూ. 225
బ్లెండర్స్ ప్రైడ్ ధర రూ. 240 నుంచి రూ. 260
సిగ్నేచర్ ధర రూ. 250 నుంచి రూ. 275
100 పైపర్స్ ధర రూ. 410 నుంచి రూ. 480కి పెరగనున్నాయి
రాయల్ గేమ్ ధర రూ. 65 నుంచి రూ. 70
ఓల్డ్ టవెరన్ ధర రూ. 80 నుంచి రూ. 90
ఆఫీసర్స్ చాయిస్ ధర రూ. 90 నుంచి రూ. 100
ఏసీ ప్రీమియం, ఎంసీ విస్కీ, ఎంసీ బ్రాందీ, ఐబీ విస్కీ వంటి బ్రాండ్లు ధర రూ. 110 నుంచి రూ. 120.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more