హనుమంతుడి భూమిగా ప్రసిద్ది చెందిన కర్ణాటకలో టిప్పు సుల్తాన్ వేడుకలను నిర్వహించడం కాంగ్రెస్ పార్టీకి సమంజమేనా..? అన్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాథ్ ప్రశ్నలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నేను అయన కన్న ఉన్నత్తమైన, ఉత్తమమైన హిందువునని, బీజేపి పార్టీలో హిందువులు మాత్రమే వున్నారా,; అంటే అదే స్థాయిలో బదులిచ్చిన విషయం తెలిసిందే.
రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టిప్పుసుల్తాన్ ను హనుమంతుడు ఓడిస్తాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, సీఎం యోగీ సంధించిన ప్రశ్నలపై నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. యోగి పేరిట ఓ లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అన్నదమ్ముల మాదిరిగా వున్న కన్నడీగుల మధ్య విద్వేషాలు, మత సామరస్యాన్ని విచ్చిన్నం చేసే విధంగా కొత్తగా విత్తనాలను ఎందుకు నాటుతున్నారని ప్రశ్నించారు. ఈ విధమైన భావజాలాన్ని పెంచడమెందుకని ప్రశ్నించారు.
అయితే తన లేఖతో పాటు పలు ఫోటోలను కూడా జత చేసిన ట్విట్టర్ లో పోస్టు చేశాడు. ఆ ఫోటోలను ఓ సారి జాగ్రత్తగా పరిశీలించాలని కూడా ఆయన యోగికి సూచించారు. కర్ణాటక రాష్ట్రంలో టిప్పు సుల్తాన్ శతజయంతి ఉత్సవాలను రాద్దంతాం చేసిన బీజేపి నేతలు.. అదే వారి అధికార హాయంలో మాత్రం అదే టిప్పు సుల్లాన్ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
అప్పుడు రాష్ట్ర బీజేపి అగ్రనేతలు సంతోషంగా పాల్గోన్నారు. అప్పుడు వేదికపై సంతోషంగా కనిపించిన నేతలు ఇప్పుడు మీలో ఎందుకు కనిపించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. మీ పార్టీ నేతలు, కార్యకర్తలు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల్లో ఎంజాయ్ చేస్తే లేని సమస్య ఇప్పుడెందుకు ఉత్పన్నమైందో చెప్పాలని నిలదీశారు. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మత పరంగా జనాలను రెచ్చగొట్టడం తప్ప మీకు ప్రజల సమస్యలు పట్టడం లేదా? అని అడిగారు.
Yogi ji orders people of Karnataka “don’t celebrate tippu sultan in the land of hanuman” dear sir.. what’s your agenda again...#justasking pic.twitter.com/wwfErkW09e
— Prakash Raj (@prakashraaj) December 22, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more