ధేశంలో పెద్ద నోట్లతో అవినీతి అంతకంతకూ పెరిగిపోతుందని అందోళన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన క్రమంలో అప్పటి వరకు చెలామణిలో వున్న పెద్దనోటు కంటే రెట్టింపుస్థాయి విలువైన నోటును గుట్టుచప్పుడు కాకుండా.. ఎవరి దృష్టి పడకుండా చెలామణిలోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటును కూడా కొన్ని రోజుల తరువాత రద్దు చేస్తారన్న వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని కేంద్రంలోని మోదీ సర్కారు సాక్షాత్తు పార్లమెంటులోనే పలుమార్లు సభ్యుల ప్రశ్నలకు బదులిచ్చింది.
దీంతో ఈ నోటు రద్దు కాదని దానిని తమ కబంధహస్తాలలో బంధించిన బడా వ్యాపారవేత్తలకు ఇప్పుడు ఎస్బీై తాజా నివేదిక చుక్కలు చూపిస్తుంది. అదేంటీ అంటారా..? త్వరలో రూ.2,000 నోట్లకు కేంద్రం చరమగీతం పాడనుందా...? తదుపరి డీమోనిటైజేషన్ ఇదే కానుందా..? అంటే ఎస్బీై తాజా నివేదిక మాత్ం అవుననే సంకేతాలను వెలువరించింది. భారతీయ రిజర్వు బ్యాంకు రూ.2,000 నోట్లను వెనక్కి తీసుకోవచ్చని లేదా అధిక విలువ కలిగిన నోట్ల ముద్రణను నిలిపివేయవచ్చంటూ ఎస్బీఐ తాజాగా విడుదల చేసిన ఎకోఫ్లాష్నివేదిక పేర్కొంది.
‘‘పెద్ద నోట్ల రద్దు అనంతరం వెంటనే మార్కెట్లో ద్రవ్య లభ్యత కోసం రూ.2,000 నోట్లు తీసుకురాగా, లావాదేవీల పరంగా సవాళ్లకు దారితీసింది. దీంతో ఆర్బీఐ రూ.2,000 నోట్లను ప్రింట్ చేయడం ఆపి ఉంటుంది. లేదా తక్కువ సంఖ్యలో ముద్రించి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో చిన్న నోట్ల వాటా 35 శాతానికి చేరింది’’ అని నివేదిక స్పష్టం చేసింది. తమ పరిశీలన ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి రూ.3,50,100 కోట్ల విలువ మేర చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. డిసెంబర్ 8 నాటికి చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో చిన్న నోట్ల విలువను మినహాయించి చూస్తే పెద్ద నోట్ల విలువ రూ.13,32,400 కోట్ల మేర ఉన్నట్టు తెలుస్తోంది.
ఆర్థిక శాఖ ఇటీవల లోక్ సభలో వెల్లడించిన సమాచారం మేరకు ఆర్బీఐ ఈ ఏడాది డిసెంబర్ 8 నాటికి రూ.500 నోట్లను 16,957 పీసుల మేర.. రూ.2,000 నోట్లను 3,654 పీసుల మేర ముద్రించింది. ఈ నోట్ల మొత్తం విలువ రూ.15,78,700 కోట్లని కూడా పేర్కొంది. ఇందులో చలామణిలో ఉన్న పెద్ద నోట్ల విలువ రూ.13,32,400ను మినహాయించి చూస్తే రూ.2,46,300 కోట్ల విలువ మేర పెద్ద నోట్లను ఆర్బీఐ ప్రింట్ చేసినప్పటికీ మార్కెట్లోకి పంపిణీ చేయలేదని నివేదికలో పేర్కొంది. ఈ మేరకు ఎస్బీఐ గ్రూప్ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ వివరించారు. అయితే, రూ.2,46,300 కోట్ల మేర రూ.50–200 మధ్య నోట్లను ఆర్బీఐ ఈ మధ్య కాలంలో ముద్రించి ఉంటుందని కూడా ఎస్బీఐ అభిప్రాయం వ్యక్తం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more