Tollywood Shock with MCA and Agnyaathavaasi Piracy | టాలీవుడ్ కు బిగ్ షాక్.. నిర్మాతలను ఆశ్రయించిన అజ్నాతవాసి, ఎంసీఏ నిర్మాతలు

Piracy in tollywood again

MCA Movie, Agnyaathavaasi Movie, Tollywood, Piracy, Tollywood Piracy, Agnyaathavaasi Piracy, Tollywood Shock, Hyderabad CCS Police

Nani's MCA, Pawan Kalyan Agnyaathavaasi Piracy Leaks Before Release. Producers Dil Raju and Radha Krishna Complained in CCS.

బిగ్ షాక్ : టాలీవుడ్ లో పైరసీ కలకలం

Posted: 12/20/2017 05:11 PM IST
Piracy in tollywood again

టాలీవుడ్ లో పైరసీ కలకలం రేగింది. కొత్త సినిమాలు విడుదల కాకముందే పైరసీ అయ్యాయంటూ ఓ ప్రముఖ మీడియాలో వార్తలు రావటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే నాని నటించిన ఎంసీఏ, పవన్ కళ్యాణ్ అజ్నాతవాసి చిత్రాలు లీక్ కాకుండా చూడాలంటూ నిర్మాతలు పోలీసులకు విజ్నప్తి చేసినట్లు మాత్రమే తెలిసింది. ఆయా చిత్ర నిర్మాతలు దిల్ రాజు, రాధాకృష్ణలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

సాయి ధరమ్ తేజ్ నటించిన జవాన్ చిత్రాన్ని పైరసీ నుంచి కాపాడుతామంటూ చిత్ర ఫైనాన్షియర్ కృష్ణయ్యకు ముగ్గురు వ్యక్తులు తెలిపారు. అందుకుగానూ పెద్ద మొత్తం ముట్టజెప్పాలని వారు కోరారు. దీంతో కృష్ణయ్య పోలీసులను ఆశ్రయించగా.. వారు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. 2012 నుంచి వీరు ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన ఆ రెండు చిత్రాల నిర్మాతలు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు.

ఇక నిర్మాత దిల్ రాజు ఫిర్యాదు చేశాక మీడియాతో మాట్లాడారు. పైరసీ అంటే దొంగతనాన్ని ఎంకరేజ్ చేయటం లాంటిదిేనని.. దయచేసి చూడొద్దంటూ విజ్నప్తి చేశారు. తొలుత ఆయా చిత్రలు పైరసీ అయ్యాయంటూ వార్తలు రావటంతో ఒక్కసారిగా కలకలం రేగగా.. తర్వాత అసలు విషయం తెలియటంతో టాలీవుడ్ ఊపిరిపీల్చుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles